జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, సంగీత.. `ఢీ`షోలో శేఖర్ మాస్టర్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు ?
`ఢీ` డాన్స్ షో నుంచి శేఖర్ మాస్టర్ వెళ్లిపోయారు. ఆయన స్థానాన్ని `ఢీ`లో భర్తీ చేసే వాళ్లెవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, నటి సంగీత వీరి ముగ్గురిలో ఎవరు పర్మినెంట్ జడ్జ్ గా ఉంటారు?
శేఖర్ మాస్టర్ `ఢీ` షో నుంచే ఎదిగారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఈ షో నుంచి డాన్స్ మాస్టర్గా, కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే సినిమాల్లో కొరియోగ్రఫీ చేశారు.
చిరంజీవి, ప్రభాస్, రామ్చరణ్, బన్నీ, పవన్, ఇలా అందరు స్టార్ హీరోలతో పనిచేయడానికి పునాది పడిందే శేఖర్ మాస్టర్ కి `ఢీ`లోనే అని చెప్పొచ్చు.
`ఢీ` నుంచి ఎదిగిన ఆయన ఆ తర్వాత ఆ షోలోనే జడ్జ్ గా వ్యవహరించడం విశేషం. గత నాలుగైదు సీజన్లలో ఆయన ఈ షోకి జడ్జ్ గా ఉంటూ వస్తున్నారు.
ఈ షోతోపాటు మధ్యలో `జబర్దస్త్`లోనూ మెరిశారు. తనదైన స్కిట్లతో కామెడీని పండించారు. శేఖర్ మాస్టర్లో డాన్సులు మాత్రమే కాదు, నటుడిగా, కామెడీయన్గానూ కూడా మెప్పించగలనని నిరూపించారు.
మొన్నటి వరకు కూడా ఆయనే జడ్జ్ గా ఉన్నారు. కానీ ఇటీవలే ఆయన `స్టార్ మా`కి వెళ్లిపోయారు. అందులో సండే రోజు ప్రసారమయ్యే `కామెడీస్టార్స్` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ షోలో నటి శ్రీదేవితో కలిసి ఆయన జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన ఎంటర్టైన్మెంట్నిస్తున్నాడు.
అయితే ఇప్పుడు `ఢీ` షోలో శేఖర్ మాస్టర్ని స్థానాన్ని ఎవరు ఫిల్ చేస్తారనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.
ఎందుకంటే గత కొన్ని రోజులుగా జడ్జ్ లు మారిపోతున్నారు. నటి సంగీత కొన్ని రోజులు జడ్జ్గా చేసింది. ఆమె తనదైన స్టయిల్లో రక్తికట్టించింది.
అలాగే ఇప్పుడు గణేష్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈయన ఇలానే కంటిన్యూ అవుతారా? లేక ఈయన కూడాకొన్ని రోజులు గెస్ట్ గానే మెరుస్తారా? అన్నది సస్పెన్స్ గా మారింది.
అయితే ఇప్పుడు జానీ మాస్టర్ పేరు కూడా తెరపైకి వస్తుంది. ఆయన్ని జడ్జ్ గా తీసుకునే ఆలోచన ఉందనే టాక్ వినిపిస్తుంది. ఆయన ఓ వైపు కొరియోగ్రాఫర్గా,మరోవైపు హీరోగా సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేస్తాడా? అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు గతంలో నాగబాబుతోపాటు ఆయన కూడా ఈటీవీ నుంచి వెళ్లిపోయిన వారిలో ఉన్నారు.
దీంతో `ఢీ` షోటో జడ్జ్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. ప్రస్తుతం వ్యవహరిస్తున్న గణేష్ మాస్టర్నే కొనసాగించే అవకాశం ఉన్నట్టు టాక్.ఈ షోలో కచ్చితంగా ఒకరు కొరియోగ్రాఫర్ ఉండాలి.
ప్రస్తుతం పూర్ణ, ప్రియమణి ఉన్నారు. కానీ వాళ్లు నటీమణులు. డాన్సులను పైపైనే చూడగలరు. కొరియోగ్రఫీలోనూ లోతులపై వారికి అవగాహన ఉండదు. కాబట్టీ కచ్చితంగా ఓ డాన్స్ మాస్టర్ కావాలి.
ఈ నేపథ్యంలో గణేష్ మాస్టర్ పేరు బలంగా వినిపిస్తుంది. మరి ఆయన కొనసాగుతారా? లేక మరో కొత్త జడ్జ్ లను తీసుకొస్తారా? అనేది చూడాలి.