పక్కా కమర్షియల్ మూవీ టికెట్ ధరల విషయంలో షాకింగ్ డెసిషన్.. ఆడియన్స్ హ్యాపీ, ఇక టాక్ ఒక్కటే..
వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గోపీచంద్ ఈ చిత్రంలో సరికొత్త కామెడీ టైమింగ్ తో కనిపిస్తున్నాడు.
లాయర్ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నాడు. ఇటీవల సినిమాల థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ అంశాలు, ప్రత్యేకమైన చిత్రాలని మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ చిత్రాలని చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లడం లేదు.
దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఓటిటి ప్రభావం బాగా పెరగడం ఒక కారణం అయితే.. రీజనబుల్ గా లేని భారీ టికెట్ ధరలు మరో కారణం. మొన్నటివరకు ప్రతి చిత్రానికి టికెట్ ధర మల్టి ఫ్లెక్స్ లలో రూ 300 పైమాటే. దీనితో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీ థియేటర్స్ లో సినిమా చూడాలంటే 1200 సమర్పించుకోవాలి. కొన్నిరోజులు వైట్ చేస్తే ఓటిటిలోకి సినిమా వచ్చేస్తోంది.
ఇక అంత ఖర్చు పెట్టి థియేటర్ కి వెళ్లడం దేనికి అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఉంది. వరుణ్ తేజ్ గని చిత్రానికి టాక్ బాగాలేదు. అయినప్పటికీ ఆ చిత్రం ఒక మోస్తరు వసూళ్లు కూడా సాధించలేదు. ఇక టాక్ బాగా వచ్చిన ఎఫ్ 3 కూడా నిలబడలేకపోయింది. స్టార్ హీరో సినిమా కాబట్టి సర్కారు వారి పాట కొంతవరకు సేవ్ అయింది.
ఈ పరిస్థితిని గమనించిన కొందరు నిర్మాతలు అలర్ట్ అవుతున్నారు. తాజాగా పక్కా కమర్షియల్ మూవీ మేకర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. టికెట్ ధరలు భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు గతంలో ఉన్న టికెట్ ధరలనే ఈ చిత్రానికి నిర్ణయించారు.
Pakka Commercial
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ 100, మల్టిప్లెక్స్ లో 150.. అలాగే తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ లో 100, మల్టిఫ్లెక్ లో 160 గా టికెట్ ధరలు నిర్ణయించారు. దీనితో పక్కా కమర్షియల్ మూవీ టీం పై ఆడియన్స్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంచి టాక్ కనుక వస్తే వీకెండ్ మొత్తం తగ్గించిన టికెట్ ధరల వల్ల హౌస్ ఫుల్స్ కావడం పక్కా అని అంటున్నారు.