- Home
- Entertainment
- రాజకీయాల్లోకి రమ్యకృష్ణ, ఏపార్టీ లో చేరబోతున్నారు..? వైరల్ అవుతున్న న్యూస్ లో నిజమెంత...?
రాజకీయాల్లోకి రమ్యకృష్ణ, ఏపార్టీ లో చేరబోతున్నారు..? వైరల్ అవుతున్న న్యూస్ లో నిజమెంత...?
టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..? ఇది నిజం అయితే.. ఆమె ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు..?

సీనియర్ నటి రమ్యకృష్ణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ.. వార్తలు వైరల్అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతా..? అటూ అభిమానులు షాక్ అవుతున్నారు. 90స్ లో హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది రమ్యకృష్ణ.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన మార్క్ చూపిస్తూ.. సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ,
మరీ ముఖ్యంగా రమ్య కృష్ణ హీరోయిన్ గా ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేసిందో.. అంతకు మించిన ఇమేజ్ ను బాహుబలి సినిమాతో సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో రమ్యకృష్ణ కెరీర్ ను మలుపుతిప్పి.. సాలిడ్ హిట్ అందించిన పాత్ర శివగామి పాత్ర. ఈ పాత్రలో ఆమె నటనకు దేశం అంతా ఫిదా అయ్యింది. ఇప్పటికీ ఆ పాత్ర ఐకాన్ గా నిలిచిపోయింది.
ఇక ఇప్పటికీ టాలీవుడ్ లో..తన మార్క్ పాత్రలలో అలరిస్తోంది రమ్యకృష్ణ..ఒకప్పుడు అమ్మవారి పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన రమ్యకృష్ణ.. ముఖ్యంగా అమ్మోరు, దేవుళ్లు సినిమాల్లో రమ్యకృష్ణను చూసిన జనం.. నిజంగా అమ్మవరే వచ్చిదన్నంతగా ఫీల్ అయ్యారు. కొంత మంది పోస్టర్లకు పూజలు కూడా చేశారు. ఇప్పుడు అత్త పాత్రలతో సందడి చేస్తోంది. తాజాగా ఆమె దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా కనిపించబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతోంది.
RamyaKrishna
ఈక్రమంలో రమ్యకృష్ణ ఇమేజ్ రాజకీయాలకు బాగా వర్కౌట్ అవుతందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఆమె రాజకీయ ఆరంగ్రేట్రంపై వార్తులు వస్తున్న నేపథ్యంలో .. ఇది నిజమేనా.. అని ఆమె అభిమానులందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే రమ్యకృష్ణ రాజకీయాల్లోకి రావడం నిజం అయితే ఏ పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం. ఆమె వైసీపీ లో చేరబోతున్నారని.. అందుకే తన సహనటి, ఏపీ మినిస్టర్ రోజాతో రమ్యకృష్ణ ఇప్పటికే మీట్ అయ్యింది.. దాంతో ఈ వార్తలకు బలం చేకూరినట్టు అయ్యింది. అయితే రోజా రమ్యకృష్ణను పాలిటిక్స్ వైపు రమ్మని అడగడంతో పాటు.. వైసీపీలో జాయిన్ చేయించాలని చూస్తున్నారంటూ వార్తలువ వచ్యాయి. అయితే ఈ వియంలో తాజాగా స్పందించారట రమ్యకృష్ణ.
రోజాను కలవడం, ఆమె ఇంటికి వెళ్ళడం, తన రాజకీయ ఆరంగ్రేట్రం పై తాజాగా స్పందించింది రమ్యకృష్ణ. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుపతి వచ్చిన రమ్యకృష్ణ దర్శనం తరువాత రోజా ఇంటికి వెళ్ళింది.ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో తొందరగా దర్శనం అవ్వడానికి అలాగే మంచి దర్శనమవ్వడానికి రోజా కారణమైంది..
అంతే కాదు.. తన సహనటి అయిన రోజాను చూసి కూడా చాలా కాలం అయ్యింది. తనతో మాట్లాడటానికి రోజా ఆహ్వానం మేరకే.. రోజాకి థాంక్స్ చెబుదామని వాళ్ళ ఇంటికి వెళ్లాను.. అంతే కాని.. రాజకీయాలకుదీనికిసబంధం లేదు.. అంటూ రమ్యకృష్ణ రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చినట్టు న్యూస్ వైరల్ అవుతోంది. అంతే కాదు భవిష్యత్తులో నేను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంటే..నేనే డైరెక్టర్ గా చెపుతాను..ఏ పార్టీలో చేరేది కూడా అప్పుడే క్లారిటీ ఇస్తాను అన్నారు.
అంతే కాని..ఇప్పుడు ఈ వార్తల్లో అస్సలు నిజం లేదు అన్నారు రమ్యకృష్ణ. ప్రస్తుతం రోజాకు...నాకు మధ్య పిల్లల చదువు గురించే కాని.. రాజకీయాలు, సినిమాల గురించి అస్సలు డిస్కర్షన్ రాలేదు అంటూ.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు రమ్యకృష్ణ. దాంతో ఆమె రాజకీయాల్లోకి రావడం ఖాయం.. కాని ఎప్పుడు..? ఏ పార్టీ అనేది .. ఆమె క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది..? ప్రస్తుతానికి ఈన్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతుంది.