జబర్దస్త్ వేదికమీద నారా లోకేష్ మీద సెటైర్, ఇమిటేట్ చేస్తూ మరీ నవ్విన రోజా
నిన్న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో నారా లోకేష్ పై ఒక కామెడీ సెటైర్ వేయడంతో రోజా పడీపడీ నవ్వడమే కాకుండా ఇమిటేట్ చేసారు కూడా.
తెలుగులో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో జబర్దస్త్ ది ప్రత్యేక స్థానం. గత కొన్నెండ్లుగా ప్రతి గురువారం రాత్రి 9.30 అయితే చాలు ప్రజలంతా తమ టీవీ సెట్లకు అతుక్కుపోయి తమ దైనందిన జీవితాల్లోని బాధలను మర్చిపోయి హాయిగా నవ్వుకుంటుంటారు. ఈ ప్రోగ్రాం టీఆర్పీ ని చూస్తే ఈ ప్రోగ్రాం కి ఆదరణ ఏ స్థాయిలో ఉందొ మనకు అర్థమైపోతుంది. (Pic Courtesy: etv Jabardasth)
హైపర్ ఆది మాట్లాడుతూ..కోట ఆదయ్య మా తాత పేరు. అదే నాకు పెట్టారు. స్కూల్, కాలేజ్లో ఆ పేరుతో బాగా ఆటపట్టించేవారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆదిగా పేరు మారింది. ‘హైపర్’ అనే టైటిల్ ‘జబర్దస్త్’ చేసేటప్పుడు మా దర్శకులు పెట్టారు. నేను చేసే స్కిట్లలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉండేది దాంతో ‘హైపర్’ అని పెట్టారు. (Pic Courtesy: etv Jabardasth)
ఈ కార్యక్రమంలో మామూలుగా స్కిట్లు రాసుకొని పంచులు వేయడమే కాకుండా... సమకాలీన పరిస్థితుల మీద కూడా కామెడీ పండిస్తుంటారు. ముఖ్యంగా హైపర్ ఆది వంటివారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద జోకులు బాగానే పేలుస్తుంటాడు. జడ్జి రోజా కూడా ఎమ్మెల్యే అవడం వల్ల ఆమె సైతం ఈ జోకులను బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇక తాజాగా నిన్న ప్రసారమైన కార్యక్రమంలో నారా లోకేష్ పై ఒక కామెడీ సెటైర్ వేయడంతో రోజా పడీపడీ నవ్వడమే కాకుండా ఇమిటేట్ చేసారు కూడా.
నిన్న తొలి స్కిట్ గా ప్రసారమైన వెంకీ మంకీస్, తాగుబోతు రమేష్ ల స్కిట్ లో భాగంగా తాగుబోతు రమేష్ నారా లోకేష్ ని ఇమిటేట్ చేస్తూ ఆయన ఒకానొక సందర్భంలో అన్న డైలాగ్ ని చెప్పారు. దీనితో రోజా పడీపడీ నవ్వారు. ఇంతకు ఆ డైలాగ్ విషయానికి వస్తే... నిన్నటి స్కిట్ లో వెంకీ పేరు పాలు కాగా తాగుబోతు రమేష్ పేరు పంచదార. గతంలో వేర్వేరుగా ఉన్న రెండు టీములను యాజమాన్యం కలిపేసి ఒకే టీం గా చేసింది. (Pic Courtesy: etv Jabardasth)
ఇద్దరు కలిసి చేస్తున్న స్కిట్ లో తమ పేరు పాలు, పంచదార అవడం వల్ల మానేజ్మెంట్ వాటిని కలిపేసినంత తేలికగా రెండు టీములను కలిపేశారని, అలా కలపడం వల్ల "తీయగుంటది" అని రెండు సంవత్సరాల కింద లోకేష్ ఒకానొక సందర్భంలో అన్న డైలాగ్ ని అనుకరిస్తూ అన్నాడు. అప్పట్లో సహాయక కార్యక్రమంలో భాగంగా నిత్యావసరాలు పంచుతున్న సందర్భంలో ఒక సామాన్యురాలు ఇచ్చిన మజ్జిగ తాగి చెక్కరేసావా అందుకే "తీయగుంది" అని అన్నాడు.
అదే స్టైల్ లో తాగుబోతు రమేష్ "తీయగుంటది" అని అన్నాడు. ఈ డైలాగ్ కొట్టగానే రోజా బాగా నవ్వి "తీయగుంటది" అనే డైలాగ్ ని సెటైర్ అనే విధంగా సూచిస్తూ బాగా ఎంజాయ్ చేసారు. నారా లోకేష్ డైలాగ్ ఎంత పోపులరైందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలో కూడా ఈ డైలాగ్ పెట్టాడంటే ఎంత వైరల్ గా మారిందో అర్థం చేసుకోవచ్చు. (Pic Courtesy: etv Jabardasth)