- Home
- Entertainment
- Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్, తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాల గురించి బయటపెట్టింది. బాడీ షేమింగ్, సైబర్ ట్రోలింగ్ వల్ల పడిన ఇబ్బందులను, ఆ సమయంలో ఓ స్టార్ హీరో ఇచ్చిన సలహా గురించి ఆమె షేర్ చేసుకుంది.

బాడీ షేమింగ్ ఫేస్ చేసిన హీరోయిన్..
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన కెరీర్ బిగినింగ్ లో బాడీ షేమింగ్, సైబర్ ట్రోలింగ్ వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తాజాగా మాట్లాడారు. ఆ కష్ట సమయంలో తనను ఆదుకున్న బాలీవుడ్ స్టార్ హీరో గురించి కూడా ఆమె వెల్లడించింది. ఆ హీరో ఇచ్చిన సలహా తనలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపిందో ఆమె వివరించారు. దుల్కర్ సల్మాన్తో కలిసి 'సీతారామం' సినిమాలో నటించి.. తెలుగువారి మనసుల్లో స్థానం సంపాదించుకున్న మృణాల్, తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు.
అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా వల్ల..
సంవత్సరాలుగా తన శరీరాకృతిపై వచ్చిన విమర్శలు, ఆన్లైన్లో ఎదురైన ట్రోలింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ ఓపెన్గా మాట్లాడారు. ఈ టైంలో అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, తన శరీరంపై ఉన్న అభద్రతాభావాన్ని పోగొట్టిందని మృణాల్ చెప్పారు.
నిద్రలేని రాత్రులెన్నో..
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. "రాత్రుళ్లు ఏడ్చుకుంటూ నిద్రపోయిన రోజులున్నాయి. ఉదయం లేచేసరికి కళ్లు ఉబ్బిపోయి ఉండేవి. నా మీద నాకే విలువ లేనట్లు అనిపించేది. ఆ సమయంలో నేను అక్షయ్ కుమార్ సర్ను కలిశాను. ఆయన చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. 'నిన్ను నువ్వు ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నీ చుట్టూ ఉన్న వేల మాటలను పట్టించుకోకుండా, నీకు అనిపించింది చేయడం గ్రేట్' అన్నారు" అని మృణాల్ తెలిపారు.
అందులో తప్పేమీ లేదు
"అంతేకాదు, 'ఒకవేళ పాత్ర కోసం బరువు తగ్గాల్సి వస్తే, అందులో తప్పేమీ లేదు' అని కూడా అక్షయ్ కుమార్ చెప్పారు," అని మృణాల్ వివరించారు. ఓ ప్రైవేట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. ఇటీవల మృణాల్ నటించిన 'డకియోట్: ఎ లవ్ స్టోరి' అనే చిత్రం విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ..
బాలీవుడ్ బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.. నాగిని సీరియల్ ద్వారా బాగా పాపులర్అయ్యింది. దేశ వ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్నఈ హీరోయిన్.. వెండితెరపై ఎన్నో అవకాశాలు సాధించింది. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్.. ఇక్కడ కూడా ఓవర్ నైట్ స్టార్ గా మారింది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ.. బిజీగా గడిపేస్తోంది.

