మహేష్ బాబు మూవీ ఆడిషన్స్ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయా, ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.
అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులో నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. సినిమాలు సక్సెస్ కాలేదు. కానీ ఎన్టీఆర్, సమీరా రెడ్డి గురించి అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి.
ప్రస్తుతం సమీరా రెడ్డి అక్షయ్ వార్థే అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంది. సినిమాలకు దూరంగా ఉంటున్న సమీరా రెడ్డి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం సమీరా యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబం గురించి, ఇతర విషయాల గురించి పోస్ట్ లు పెడుతూ ఉంటుంది.
తాజాగా సమీరారెడ్డి ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేసింది. తన కెరీర్ ప్రారంభ రోజులని గుర్తు చేసుకుంది. అరుదైన ఫోటోలు షేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వివిధ ఆడిషన్స్ కి వెళ్ళేదట.
తన ఫస్ట్ మూవీ ఆడిషన్ 1998లో జరిగినట్లు సమీరా రెడ్డి పేర్కొంది. లంగా ఓణీ ధరించి పదహారణాల తెలుగు అమ్మాయిల ఈ ఫొటోల్లో సమీరా కనిపిస్తోంది. ఆమె ఫస్ట్ ఆడిషన్ జరిగింది సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రానికే అట. ఇవి నా ఫస్ట్ ఆడిషన్స్ అప్పటి ఫోటోలు. మహేష్ బాబు సినిమా కోసం ఆడిషన్స్ కి హాజరయ్యాను. అప్పట్లో నాకు చచ్చేంత భయం ఉండేది. ఆడిషన్స్ లో పెర్ఫామ్ చేయడం నావల్ల కాలేదు. ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాను.
డెస్క్ దగ్గర కూర్చుని చేసే ఉద్యోగమే కరెక్ట్ అనిపించింది. రెండేళ్ల పాటు ఓ కంపెనీలో ఉద్యోగం చేశా. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని తిరిగి సినిమా అవకాశాలు ప్రారంభించా. తొలిసారి ఒక మ్యూజిక్ వీడియోలో నటించి కాన్ఫిడెన్స్ సొంతం చేసుకున్నట్లు సమీరా పేర్కొంది. అప్పుడు ఆమె ధైర్యంగా పెర్ఫామ్ చేసి ఉంటే.. అభిమానులు మహేష్, సమీరా జోడీని వెండితెరపై చూసేవారు.
సమీరా రెడ్డి ఎప్పుడూ మహేష్ సినిమాలో నటించలేదు. చిరంజీవి , ఎన్టీఆర్, సూర్య లాంటి హీరోల సరసన నటించింది. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో మెరిసింది. వెండితెరపై సమీరా రెడ్డి ఒక రేంజ్ లో అందాలు ఆరబోసి యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది.