రెండు నెలల పాటు ఒక్కపూట భోజనమే తిన్న.. సమంత షాకింగ్ కామెంట్స్.!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత రూత్ ప్రభు (Samantha) తాజాగా తన స్రగ్లింగ్ డేస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ విశ్వవిద్యాలయానికి వెళ్లిన స్టార్ హీరోయిన్ కాస్తా ఎమోషనల్ అవుతూ స్పీచ్ ఇచ్చింది.
చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిస్సందేహంగా అత్యంత ప్రాధాన్యత దక్కించుకున్న నటీమణులలో ఒకరు. అదే స్థాయిలో తన క్రెడిట్ కు తగ్గ సినిమాల్లో నటించి తెలుగు, తమిళ ఆడియెన్స్ లో చెరిగిపోని ముద్ర వేసుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
గతేడాది చైతూతో విడాకాలు తీసుకున్న తర్వాత సమంత తన కేరీర్ పైనే ఫోకస్ పెట్టింది. వరుస చిత్రాలను అనౌన్స్ బిజీయేస్ట్ గా హీరోయిన్ గా మారిపోయింది. అయితే కాస్తా సమయం ఉన్నప్పుడల్లా ఆయా ప్రదేశాలను, పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఫొటోషూట్లు, గుళ్లు గోపురాలు తిరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా సమంత చెన్సైలోని సత్యబామ విశ్వవిద్యాలయాని ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్లింది.
అక్కడ సమంత విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘నేను చదువుకునే రోజుల్లో మా అమ్మా, నాన్న నన్ను కష్టపడి చదిచాలని, పెద్దదాన్ని చేయాలని భావించారు. నేనూ కష్టపడి చదివాను. 10వ తరగతి, 12వ తరగతిలో కాలేజీ టాపర్గా రాణించాను. కానీ ఉన్నత విద్యనభ్యసించేందుకు మా తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో నా కలలకు గమ్యం లేదు. భవిష్యత్ కూడా లేదు. ’ అంటూ చెప్పింది.
అలాగే, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులు తమ నుండి ఆశించే మార్గంలో నడవాలన్నారు. దాంతో పాటు పెద్ద గోల్స్ పెట్టుకోవాలని సూచించారు. వాటిని చేధించడంలో నిమగ్నమవ్వాలన్నారు. జీవితంల కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయని, మన గోల్స్ ను చేరుకునే ప్రయాణాన్ని మాత్రం ఆపొద్దంటూ మోటివేట్ చేసింది.
ఈ క్రమంలో తన కేరీర్ తొలి రోజుల్లోని కష్టతరమైన పరిస్థితులను పంచుకుంది. ‘నేను కనీసం రెండు నెలలు రోజుకు ఒకపూట మాత్రం భోజనం తిన్నాను. నేనూ ఉద్యోగాలు చేశాను. చివరిగా ఈ రోజు ఇక్కడ ఉన్నాను. నేను చేయగలిగినంటే.. మీకే చేయగలరు.. మీ కలల్ని సాధించుకోగలరని’తెలిపింది. సమంత తన కేరీర్ ప్రారంభ దశలో కాస్తా ఇబ్బందులు ఎదుర్కొని.. నిలదొక్కుకొని స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుండటం గొప్ప విషయం.
వర్క్ ఫ్రంట్లో, సమంత ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో సై-ఫై ఫిల్మ్ యశోద (Yashoda) కాగా, మరో చిత్రం ‘శాకుంతలం’. ఇప్పటికే యశోద ఫిల్మ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ‘శాకుంతలం’ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే త్వరలోనే సమంత బాలీవుడ్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది.