నాగార్జునపై `సమంత- చై బ్రేకప్` ప్రభావం.. అదే ఎఫెక్ట్ `బిగ్బాస్5`పై కూడా పడిందా ?
కింగ్ నాగార్జున ఓ విషయంలో భయపడుతున్నారు. `బిగ్బాస్5`కి ముందు మీడియా ముందుకు వచ్చేందుకు భయపడ్డారు. అందుకే `బిగ్బాస్` ఐదో సీజన్ ప్రారంభానికి ముందు దూరంగా ఉన్నారు. మరి ఆయన్ని భయపెడుతున్న అంశమేంటి?
బిగ్బాస్5 సీజన్ నాగార్జున హోస్ట్ గా ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. కోట్లాది మంది ఆడియెన్స్ ఎదురుచూస్తుండగా, గ్రాండ్గా ఈ షో లాంచ్ అయ్యింది. నాగ్ తనదైన స్టయిల్లో డాన్సులు చేసి ఫిదా
చేశారు. `ఒక లైలా కోసం.. `అంటూ, `మాస్.. `అంటూ దుమ్మురేపాడు. ఇక వరుసగా కంటెస్టెంట్లని పరిచయ కార్యక్రమం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో నాగార్జునకి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే ఆయన తనయుడు,హీరో నాగచైతన్య, సమంతల మ్యాటర్.
వీరిద్దరి విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాగ్ ఫ్యామిలీతో సమంతకి చెడిందని, దీంతో కొంత కాలంగా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.
దీంతోపాటు సమంత రకరకాల పోస్ట్ లు పెడుతూ వస్తోంది. చైతన్యతో డైవర్స్ తీసుకుంటుందని, అందుకే దూరంగా ఉంటుందని వార్తలొస్తున్నాయి. దీనికి బలం చేకూరేలా సమంత పోస్ట్ లు పెట్టడం, అనేక అనుమానాలకు తావిస్తుంది. నిజంగానే చై, సామ్ విడిపోతున్నారని ప్రచారం జరుగుతుంది.
దీంతో ఈ విషయంపై తాను మీడియాని ఫేస్ చేయడం కష్టమని భావించి `బిగ్బాస్5`కి ముందు మీడియా మీట్కి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ మీట్ని దూరంగా ఉన్నట్టు నిర్వహకులు తెలిపినా, అసలు నిజం ఇదే అని అంటున్నారు.
ఇలా సమంత, నాగచైతన్యల డైవర్స్ మ్యాటర్ నాగార్జునపైనే కాదు, ఇప్పుడు పరోక్షంగా `బిగ్బాస్5`పై కూడా పడిందని చెప్పొచ్చు. మరి రియల్లైఫ్లో ఏం జరుగుతుందో గానీ ఇప్పుడు సమంత, చైల మ్యాటర్ `బిగ్బాస్5`కి కూడా తాగిందని చెప్పొచ్చు.