తనలోని ఆధ్యాత్మిక యాంగిల్ని చూపించిన సమంత.. షాక్లో అభిమానులు
సమంత అంటే స్టార్ హీరోయిన్, ట్రెండీ డ్రెస్సుల్లో అందాల విందు ఇస్తూ అభిమానులను సందడి చేస్తుంది. నటిగా వెండితెరపై మెస్మరైజ్ చేస్తుంటుందనేదే తెలుసు. కానీ సమంతలో జనాలకు తెలియని మరో కోణం ఉంది. ఆమెలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. తాజాగా దాన్ని బయటపెట్టింది సమంత.
సమంత ఇటీవల ఎయిర్పోర్ట్ లో మెరిసింది. ఎయిర్పోర్ట్ ఫోటోగ్రాఫర్ ఆమెని బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ ఫోటోలు హల్చల్ చేశాయి. కానీ సమంత అసలు ఎక్కడికి వెళ్తుందనేది ఎవరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు సమంత దాన్ని రివీల్ చేసింది. సద్దురు సేవకు వెళ్లింది. తమిళనాడులోని `ఇషా ఫౌండేషన్`కి వెళారు. అక్కగ భగవాన్ సద్దురుని కలుసుకున్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలు ఆయనతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పంచుకుంది సమంత. గురువుని కలుసుకోవాలని శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ గురువు కనిపిస్తాడని చెప్పింది. ఇందులో ఇషా ఫౌండేషన్ని యాడ్ చేసింది.
ఇంకా చెబుతూ, `ఆధ్యాత్మిక ప్రక్రియ మొత్తం ప్రయత్నం మీ కోసం మీరు గీసిన సరిహద్దులను విచ్చిన్నం చేయడమే. మీరున్న అపారతను అనుభవించడం. మీ స్వంత అజ్ఞానాన్ని విడగొట్టడమే. మీ పుట్టుక, సృష్టికర్త మిమ్మల్ని చేసినట్టుగా జీవించడం పూర్తిగా ఆనందకరమైన, అనంతమైన బాధ్యత` అని తెలిపింది.
`జ్ఞానోదయం ఎలా సాధించడం, సాధించడమేకాదు దాని గురించి మాట్లాడటం చేయాలి. మీ ఇంద్రియాలు మీరు వెలుపల అనుభవిస్తున్నారనే అభిప్రాయాన్ని ఇస్తాయి. కానీ మీరు బయటికి ఎప్పుడు అనుభవించలేరు. మీరు అనుభవించినవన్నీ లోపల ఉన్నాయని మీరు గ్రహించినప్పుడు సంపూర్ణ జ్ఞానోదయం కలుగుతుంది` అని చెప్పింది సమంత.
ఎప్పుడు గ్లామర్ సైడ్, మోడ్రన్ సైడ్ కనిపించిన సమంతలో ఈ కొత్త యాంగిల్ చూసి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. మహదేవ విగ్రహాన్ని పంచుకుంటూ, తాను ఇన్నర్గా గ్రోత్ కావాలనుకుంటున్నట్టు తెలిసింది సమంత.
ఈ రెండు ఫోటోలను సమంత తాజాగా పంచుకుంది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాను సద్దురిని కలిసిన వెంటనే సమంత రిటర్న్ అయ్యారు. మళ్లీ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో కనిపించింది సమంత.
సమంత ప్రస్తుతం `సామ్జామ్` టాక్ షోకి హోస్ట్ గా చేస్తుంది. దీంతోపాటు అనే టీవీ యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది. అలాగే ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోతున్న `శాకుంతంలం` చిత్రంలో మెయిన్ లీడ్గా నటిస్తుంది సమంత.