అందమైన ఆ ఆనంద క్షణాలు ఎంతో వేగంగా గడిచిపోయాయి.. సమంత ఎమోషనల్ పోస్ట్
ఇష్టమైన పనులు చేయడం ద్వారా మనోవేదన నుండి బయటపడే ప్రయత్నం చేస్తుంది సమంత.Naga chaitanya తో బ్రేకప్ పెయిన్ నుండి రిలీఫ్ పొందే పనుల్లో నిమగ్నమయ్యారు ఆమె. మరలా మామూలు జీవితంలోకి ప్రవేశించేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధం అవుతున్నారు.
దీనిలో భాగం తనకు ప్రియమైన మిత్రులతో ఇష్టమైన ప్రదేశాలకు విహారానికి వెళుతుంది సమంత. తాజాగా Samantha వన్ వీక్ డెహ్రాడూన్ టూర్ ని ఎంజాయ్ చేసి వచ్చారు. ఈ ట్రిప్ లో అందమైన ప్రదేశాలలో వివహరించడంతో పాటు, ఫ్రెండ్స్ తో ఆహ్లాదంగా గడిపారు.
హైదరాబాద్ కి చెందిన డిజైనర్ కమ్ న్యూట్రిషియన్ శిల్పా రెడ్డి సమంతకు అత్యంత సన్నిహితురాలు. సమంత ఆనందమైనా, బాధైనా ముందుగా Shilpa reddy తో పంచుకుంటుంది. శిల్పా రెడ్డి కుటుంబ సభ్యులతో కూడా సమంతకు చనువు ఉంది. దీనితో డెహ్రాడూన్ ట్రిప్ కి సమంత, శిల్పా రెడ్డి ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.
Samantha
డెహ్రాడూన్ జిమ్ లో టగ్ ఆఫ్ వార్ ఆడిన వీడియో సమంత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అయ్యింది. అదే సమయంలో సమంత, శిల్పా రెడ్డి డెహ్రాడూన్ ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ట్రిప్ కి సంబంధించిన ఒక ఎమోషనల్ పోస్ట్ సమంత సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందమైన, సరదా, ఆనంద క్షణాల ఈ వారం ఎంతో వేగంగా గడిచిపోయాయి అంటూ పోస్ట్ పెట్టింది. అలాగే ఫ్లైట్ లో, డెహ్రాడూన్ లో శిల్పారెడ్డి తో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. సమంత ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సమంత శిల్పా రెడ్డి సాన్నిహిత్యాన్ని ఎంతగానో కోరుకుంటారని, సాధకబాధకాలలో తనకు తోడు ఆమె అని అర్థం అవుతుంది. విడాకులు ప్రకటనకు ముందు కూడా సమంత ఎక్కువ సమయం శిల్పా రెడ్డి కుటుంబంతో గడిపేవారు. చైతూతో చాలా కాలంగా విడిగా ఉంటున్న సమంత ఆ మధ్య శిల్పా రెడ్డి ఫ్యామిలీతో గోవా ట్రిప్ కి వెళ్లడం జరిగింది.
మరోవైపు సమంత దసరా కానుకగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. ఇక కెరీర్ పై ఫోకస్ పెట్టిన సమంత వరుసగా చిత్రాల ప్రకటన చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మరోవైపు సమంత, చైతు మధ్య సయోధ్య కుదిర్చి ఒక్కటి చేయాలని ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Also read ఫ్యామిలీ ప్లానింగ్ కోసం షారుక్ మూవీ వదులుకున్న సమంత!