ప్రభాస్ `ఆదిపురుష్`లో విలన్, హీరోయిన్ కూడా ఫిక్స్!
రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న `ఆదిపురుష్` సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను 2021లో ప్రారంభించి 2022లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టీ సీరిస్ సంస్థ దాదాపు 350 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తుంది.
బాహుబలి సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. బాహుబలి జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో ఆ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. సాహో సినిమాతో మరోసారి బాలీవుడ్లోనూ సత్తా చాటడంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. దీంతో ప్రభాస్ కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు.
గతంలో కరణ్ జోహార్ నిర్మాణంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడంటే పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. కానీ ప్రభాస్ స్ట్రయిట్ హిందీ సినిమా కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే రాధే శ్యామ్ సెట్స్ మీద ఉండగానే నాగ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ పాంటసీ చిత్రాన్ని ఓకే చేశాడు ప్రభాస్. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారు.
అయితే నాగ అశ్విన్ సినిమా ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లకుండానే మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. తానాజీ ఫేం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమాను చేస్తున్నాడు ప్రభాస్. దీనికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.
రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను 2021లో ప్రారంభించి 2022లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టీ సీరిస్ సంస్థ దాదాపు 350 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తుంది.
అయితే ఈ సినిమాలో విలన్గా రావణాబ్రహ్మ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తుండన్న టాక్ వినిపిస్తోంది. ఓం రౌత్ తెరకెక్కించిన తానాజీ సినిమాలోనూ సైఫ్ విలన్గా కనిపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రభాస్కు జోడిగా సీత పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే పాత్ర ఎంపికకు సంబంధించి చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.