సాహో టీమ్ ప్రెస్ మీట్ (ఫోటోలు)
సాహో టీమ్ ప్రెస్ మీట్ (ఫోటోలు)
బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం సాహో ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ 20 రోజుల ముందే ప్రమోషన్ డోస్ పెంచేసింది. రీసెంట్ గా ముంబై మీడియాతో మాట్లాడిన ప్రభాస్ - శ్రద్దా కపూర్ ఆదివారం టాలీవుడ్ మీడియా ముందుకు వచ్చారు
బాహుబలి 1 కంటే ముందే ఈ కథ నేను విన్నాను. కానీ బాహుబలి 2 తరువాత సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. యాక్షన్ విజువల్స్ పరంగా కొన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది
ఈ సందర్బంగా శ్రద్దా కపూర్ మాట్లాడుతూ.. ఇదే నా మొదటి సినిమా కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఇంత పెద్ద సినిమా కావడం వెరీ స్పెషల్ అని చెప్పవచ్చు. అందుకు నిర్మాతలకు దర్శకుడికి చాలా థ్యాంక్స్.
ప్రభాస్ తో నటించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. దాదాపు రెండు రెండేళ్లు సినిమాతో ట్రావెల్ చేశాను. హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్ అయ్యింది.
ప్రభాస్ తో రొమాన్స్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ లో నటించగా అందులో ఏ సీన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేశారని యాంకర్ అడగ్గా.. అందుకు శ్రద్దా మాట్లాడుతూ.. ఒక్కటి అని చెప్పలేను. అది చాలా కష్టం. రెండు యాంగిల్స్ లో ఎంజాయ్ చేస్తూ నటించమని ఆమె వివరణ ఇచ్చారు.
టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ డోస్ పెంచింది. ఆదివారం సాయంత్రం టాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్ సినిమాకు సంబందించిన అనేక విషయాలపై సమాధానం ఇచ్చారు
ట్రైలర్ రిలీజ్ కాగానే చాలా మంది కాల్ చేశారు. బాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోలు కూడా మెస్సేజ్ చేశారు. నా స్నేహితులు అలాగే రాజమౌళి కూడా కాల్ చేసి బావుందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే చిరంజీవి గారు నాకు మెస్సేజ్ చేయగానే షాక్ అయ్యాను
ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అన్నారు నిర్మాత ప్రమోద్ ఉప్పలపాటి. రేపటి నుంచి రిలీజ్కు సంబంధించిన పనులు మొదలుపెడతామని, ఆగస్టు 30న గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రమోద్ తెలిపారు