RRR హైలెట్స్: గండరగండుడు తారక్.. మన్యం వీరుడు చరణ్!
మొత్తానికి RRR సినిమా గురించి జక్కన్న గ్యాంగ్ ఓకే క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం.. అలాగే సినిమా పాత్రలు..అలాగే కథలో ఎలాంటి విషయాలు జక్కన్న చూపించే స్కోప్ ఎక్కువగా ఉందనే ఇతర విషయాలపై ఓ లుక్కేద్దాం..
మొత్తానికి RRR సినిమా గురించి జక్కన్న గ్యాంగ్ ఓకే క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం.. అలాగే సినిమా పాత్రలు..అలాగే కథలో ఎలాంటి విషయాలు జక్కన్న చూపించే స్కోప్ ఎక్కువగా ఉందనే ఇతర విషయాలపై ఓ లుక్కేద్దాం..
మొదట ప్రెస్ మీట్ పెట్టి జనాలకు క్లారిటీ ఇవ్వడానికి అసలు కారణం.. సినిమాపై జనాల అంచనాల్లో హెచ్చు తగ్గులు లేకుండా ఉండేందుకు. కథ పాత్రలపై ముందే క్లారిటీ ఇస్తే.. సినిమాపై ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వెయిట్ చేస్తుంటారు. వేరొక ఆలోచన ఉండదు. అంచనా అనేది సినిమాకు చాలా అవసరం.
గండర గండుడు కోమురం భీమ్ గా తారక్.. మన్యం వీరుడిగా చరణ్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
RRR సినిమాలో దర్శకుడు ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఎవరు ఊహించని కోణంలో చూపిస్తాను అని చెబుతున్నాడు. పాత్రలను తీసుకొని కల్పిత కథను సిద్ధం చేసుకున్నట్లు చెప్పాడు. అయితే చరిత్రలో కొన్ని రూమర్స్ ఉన్నాయ్.
ఇద్దరు యోధులు ఒకే కాలానికి చెందిన వారు కావడం.. ఒకేసారి అజ్ఞాతం లోకి వెళ్లినట్లు జక్కన్న చెప్పాడు. కానీ చరిత్ర ప్రకారం కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.
కొమురం భీమ్ జననం - 22 అక్టోబర్ 1901: చనిపోయిన నాటికి వయసు 38 (1948 - 24 అక్టోబర్)
20 ఏళ్ల వయసులో అస్సాంలో మూడేళ్లవరకు ఉండి విద్యాబ్యసం.. ఇతర యుద్ద విన్యాసాలు వంటి విషయాల గురించి నేర్చుకున్నాడని చరిత్ర చెబుతోంది.
నిజాం నవాబుల ఆగడాలు తట్టుకోలేక ఒకానొక సమయంలో సిద్ధిఖీ అనే జాగీర్ ధార్ ని చంపేసి అస్సాంకి పారిపోయాడని కొన్ని కథనాలు ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనే విషయంలో జక్కన్న మాత్రం అందుకు బలమైన ఆధారాలు లేవని అంటున్నారు.
అస్సాంలో తేయాకు కాపీ పత్తి వంటి తోటల్లో పనిచేసి విద్యాబ్యసం చేసి ఐదేళ్ల తరువాత జాతి కోసం జంగ్ సైరెన్ జమాయిస్తూ సొంత గూటికి చేరుకొని నిజాం నవాబులపై ఎదురు తిరుగుతాడని చరిత్రలో ఒక అంశం.
అల్లూరి సీతారామరాజు: జననం జులై 4 -1897... మరణం మే 9 -1924 (26)
1916 ఏప్రిల్ 26న ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేహరారని తెలుస్తోంది. బెంగాల్ లక్నో కాశి ఇలా పలు ప్రాంతాలను పర్యటించి ఎన్నో విద్యాభ్యసలను అలాగే అన్ని రకాల భాషలను నేర్చుకొని చివరకు సన్యాసం తీసుకొని యోగిలా మన్యంలోకి అడుగు పెట్టినట్లు చెబుతుంటారు. ఆ తరువాత బ్రిటిష్ సైన్యాలపై తిరుగుబాటు చేస్తారు.
ఇద్దరు యోధులు అలా ఇంచుమించు ఒకే సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో వెళ్లడంతో జక్కన్నకు కథను అల్లడానికి మంచి అవకాశం దక్కింది.
సినిమాలో ఇద్దరు కథానాయకులు అజయ్ దేవగన్ వద్ద శిష్యరికం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ స్పెస్ ఇప్పుడు జక్కన్నకు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ కథలో హీరోలు ఎవరిపై యుద్ధం చేస్తారు.. నిజాం నవాబుల మీదనా? బ్రిటిష్ రాజుల మీదనా? కలిసి వారు చేసిన పోరాటాలు ఏమిటనేది తెరపై చూడాలి అని జక్కన్న చెబుతున్నాడు.
400కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న RRR సినిమా జూన్ 30 2020లో రిలీజ్ కానుంది.