నీ గుర్తింపు కేవలం ఒకరి భార్యగా మాత్రమే కాదు: రేణు దేశాయ్
తాజాగా తన మనోభావాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది రేణూ దేశాయ్. `ఈ సోసైటీలో ఎంతో మంది దృష్టిలో నేను ఒంటరి మహిళను. సింగిల్ పేరెంట్ను. అందరి లాంటి మహిళను కాను. పురుషాధిక్య ప్రపంచంలో బంధాలన మధ్య జీవించే మహిళను. భర్త లేకున్నా నా పిల్లలను నేను స్వశక్తితో పెంచుకుంటున్నా` అంటూ కామెంట్ చేసింది
తన కంటూ సొంత గుర్తింపు కోసం ఎప్పటికప్పుడూ గళమెత్తుతూనే ఉంది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్తో ప్రేమ, పెళ్లి తరువాత విడాకులతో రేణు దేశాయ్ పేరు తెలుగు మీడియాలో వైరల్ అయ్యింది. ముఖ్యంగా పవన్తో విడిపోయిన తరువాత సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్కి తీవ్ర వేదింపులు ఎదురయ్యాయి. పవన్ అభిమానులు రేణు టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల చేశారు.
ఒక దశలో ఈ ట్రోల్స్ వేదింపులు భరించలేక సోషల్ మీడియాకు దూరమైంది రేణు. తరువాత నెమ్మదిగా ట్రోల్ చేసే వారికి సమాధానం ఇవ్వటం అలవాటు చేసుకుంది. తన కాళ్ల మీద తాను నిలబడుతున్నానని, ఎవరి సాయం తీసుకోవటం లేదని, తనను టార్గెట్ చేయవద్దని ఆవేదన వ్యక్తం చేసింది.
పవన్కు దూరమైన తరువాత రేణు స్వశక్తి మీద ఎదుగుతోంది. హీరోయిన్గా చేయకపోయినా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. రచయితగా దర్శకురాలిగా సత్తా చాటుతోంది. టెలివిజన్ షోస్లోనూ బిజీగా ఉంటుంది. అదే సమయంలో రచయిత్రిగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది రేణూ దేశాయ్.
తాజాగా తన మనోభావాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది రేణూ దేశాయ్. `ఈ సోసైటీలో ఎంతో మంది దృష్టిలో నేను ఒంటరి మహిళను. సింగిల్ పేరెంట్ను. అందరి లాంటి మహిళను కాను. పురుషాధిక్య ప్రపంచంలో బంధాలన మధ్య జీవించే మహిళను. భర్త లేకున్నా నా పిల్లలను నేను స్వశక్తితో పెంచుకుంటున్నా.
నా కాళ్లపై నేను నిలబడి, బిజినెస్ చేసుకుని, ఆర్థికంగా బలపడగలిగే శక్తి ఉన్న స్త్రీని. అలాగే అన్యాయాలను ఎదిరించే మహిళను. సమాజంలోని పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉండటానికి అంగీకరించని మహిళను. కానీ ఇవ్వన్నీ ఎలాంటి కారణాలు లేకుండా నాపై ఉన్న అభిప్రాయలు.
ఓ మహిళకు మరొకరి భార్యగా, కుమార్తెగా మాత్రమే గుర్తింపు కాదు. మీ జీవితంలో మీరు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. అలాగని సాంప్రదాయ విలువలను కించపరచటం స్త్రీ వాదం కాదు. కేవలం కుటుంబ వ్యవస్థ ముసుగులో శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటమే స్త్రీవాదం అంటూ సుధీర్ఘంగా పోస్ట్ చేసింది.