మోహన్ బాబు చంద్రబాబును కలవడానికి అసలు కారణం ఇదా..? మరి మంచువారు అనుకున్నది అయినట్టేనా..?
ఆమధ్య చంద్రబాబును స్పెషల్ గా కలిశారు మోహన్ బాబు. అప్పుడు వీరిద్దరి మీటింగ్ హాట్ టాపిక్ అయినా.. అది ఏంటీ అనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు.చివరికి మీడియాకూడా పసిగట్టలేకపోయింది. కాని ఇన్ని రోజులకు వీరిద్దరి కలయికకు అసలు రీజన్ దొరికిందంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ ఇదే.
ప్రస్తుతం రాజకీయవర్గాల్లో.. ఫిల్మ్ ఇండస్ట్రీ లో.. హాట్ టాపిక్ గా మారింది మంచు మనోజ్ పెళ్లి. తెలుగుదేశం ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ పెళ్ళి చేసుకోబోతున్నాడంటూ.. ఇండస్ట్రీ అంతా మారు మెగిపోతోంది. అయితే కొంత కాలం క్రితం మంచు మోహన్ బాబు..తెలుగు దేశం అదినేత చంద్రబాబును కలవడానికి కారణం ఇదే అంటూ న్యూస్ హల్ చల్ చేస్తోంది.
మోహన్ బాబు, ఆమధ్య టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే అప్పుడు ఈ మీటింగ్ తెలుగు రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యింది. అంతా రాజకీయంగా ఆలోచించారు కాని.. ఫ్యామిలీ పరంగా ఎవరూ ఆలోచించలేదు. చివరకు మీడియా కూడా కనిపెట్టలేక పోయింది వీరి కలయికకు కారణం ఏంటీ అని. అటు మోహన్ బాబు కూడా.. తాను నిర్మించిన శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం గురించి మాట్లాడడానికి మాత్రమే చంద్రబాబుని కలిశానని చెప్పి అందరిని నమ్మించారు.
ఇక తాజాగా మంచు మనోజ్ .. తెలుగు దేశంఫ్యామిలీకి చెందిన భూమా మౌనికా రెడ్డి ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు బయటకి రావడంతో.. అసలు విషయం ఇప్పుడు బయట పడింది. భూమా ఫ్యామిలీతో సంబంధం గురించి మాట్లాడడానికే మోహన్ బాబు.. చంద్రబాబుని కలిశాడేమో అనే చర్చ రాజకీయ సినీ వర్గాల్లో మొదలైంది.
మనోజ్, మౌనికలు కలిసి రీసెంట్ గా గణేష్ మందిరంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. దాంతో ఏ కారణం లేకుండా వీరు పూజలు ఎందుకు చేస్తారు. వీరు పెళ్ళి చేసకోబోతున్నారంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇంత వరకూ ఎవరూ అఫీషియల్ గా స్పందించలేదు. త్వరలో ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
మంచు మనోజ్ కు గతంలోనే పెళ్లి జరిగింది.. మంచు మనోజ్, ప్రణతి అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుని చాలా కాలం అన్యోన్యం గా ఉన్నారు. కానీ ఏం జరిగిందో.. ఏమో తెలియదు కానీ.. సడెన్గా ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు. వారికి విడాకులై కూడా చాలా కాలం అవుతుంది. అప్పటి నుండి సింగిల్గానే ఉంటున్న మంచు మనోజ్.. ఇప్పుడు మరోసారి పెళ్లికి రెడీ అవుతున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.