డెనిమ్ జాకెట్ లో సూపర్ స్టైలిష్ గా, కళ్ళతో కవ్విస్తూ కామెంట్ చేయమంటున్న రష్మిక!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఫ్యాన్స్ కోసం ఆమె తన వ్యక్తిగత విషయాలు, సినిమా సంగతులు పంచుకుంటూ ఉంటారు.
టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ఎదిగిన ఈ బ్యూటీని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 19మిలియన్స్ ఫాలో అవుతున్నారు. దాదాపు రెండు కోట్లకు ఆమె ఫాలోయింగ్ చేరిందన్న మాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అమ్మడు రేంజ్ ఈ స్థాయిలో ఉందో.
అతి తక్కువ కాలంలో స్టార్డం సంపాదించిన హీరోయిన్ గా రష్మిక నిలిచారు. అత్యధిక హిట్ పర్సన్టేజ్ ఆమెకు కలిసి వచ్చింది. ఒకటి రెండు మినహా ఇస్తే, రష్మిక తెలుగులో చేసిన అన్ని చిత్రాలు విజయం సాధించాయి.
కరోనా ఇయర్ గా మిగిలిన 2020లో కూడా రష్మిక రెండు హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. మహేష్ కి జంటగా చేసిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా, నితిన్ తో చేసిన భీష్మ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక పుష్ప తో పాన్ ఇండియా చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది రష్మిక. దర్శకుడు సుకుమార్ రెండు పార్ట్స్ గా, భారీ బడ్జెట్ తో పుష్ప తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో, విడుదల త్వరలోనే అంటున్నారు.
అలాగే హిందీలో రెండు చిత్రాలు చేస్తుంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను, అలాగే అమితాబ్ గుడ్ బై మూవీలో ఆమె నటిస్తున్నారు.
రష్మిక తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. డెనిమ్ జాకెట్ ధరించి సూపర్ స్టైలిష్ గా ఉన్న రష్మిక... నా కళ్ళను మాట్లాడనివ్వండి, దీనికి మీ క్యాప్షన్ ఏమిటి?... అంటూ కామెంట్ పెట్టారు.
రష్మిక అడిగితే ఫ్యాన్స్ ఇక ఊరుకుంటారా... వందల కొలది కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. అలాగే లైక్స్ తో తమ అభిమానం చాటుకుంటున్నారు.