`పుష్ప` బ్యూటీ రష్మిక మందన్న సంచలన నిర్ణయం.. ఆ భయంతో సోషల్ మీడియాకి గుడ్బై.. కానీ
ఇటీవల పెట్తో ప్రేమలో పడిపోయానని చెప్పి షాక్ ఇచ్చిన రష్మిక మందన్నా.. తాజాగా మరో షాకింగ్ విషయం వెల్లడించింది. ఆ బాధ భరించలేక సోషల్ మీడియా విషయంలో సంచలన నిర్ణయం తీసుకోవాలనుకుందట. ఇంతకి ఆ బాధేంటో చూస్తే..
రష్మిక అల్లరిలో టాప్ గా ఉండటమే కాదు, టాలెంట్లోనూ టాప్లోనే ఉందీ అందాల భామ. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఇటు కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
ఈ అమ్మడికి సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. రెగ్యూలర్గా ఫ్యాన్స్ తోనూ చాట్ చేస్తుంది రష్మిక, లైవ్ ఛాట్ నిర్వహిస్తూ వారిని ఖుషీ చేస్తుంది. మరోవైపు గ్లామర్ ఫోటోలతోనూ, క్యూట్ పిక్స్ ని పంచుకుంటూ ఫాలోయింగ్ని పెంచుకుంటోంది.
ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్కి ముందు తాను ఓ సంచలన నిర్ణయం తీసుకోవాలనుకుందట. సోషల్ మీడియాకి గుడ్బై చెప్పాలనుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వలో రానుందని తన టీం చెప్పడంతో తన సోషల్ మీడియా ఖాతాలను డిలిట్ చేయాలనుకున్నట్లు తెలిపింది.
రష్మిక మాట్లాడుతూ, `కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అర్థమైంది. అవి ఎంతో బాధను ఇవ్వడం కాక, మానసిక శాంతిని దూరం చేస్తాయి. అందుకే మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాను విడిచిపెట్టాలని అనుకున్న. కానీ అలా చేయలేకపోయాను.
ఈ సంక్షోభ సమయంలో సామాన్య ప్రజలకు సహాయం చేస్తున్న వారిలో స్ఫూర్తి నింపాలని కోరుకున్నా. అందుకే `spreading hope` అనే సంస్థని ప్రారంభించాను` అని తెలిపింది.
ప్రస్తుతం రష్మిక.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. అలాగే శర్వానంద్తో కలిసి `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా చేస్తుంది. బాలీవుడ్లో `మిషన్ మజ్ను`, అమితాబ్తో `గుడ్బై`తోపాటు మరో సినిమా చేస్తూ బిజీగా ఉందీ క్యూట్ అందాల భామ.