పొట్టి స్కర్ట్ లో రష్మిక మందన్నా థైస్ షో.. సక్సెస్ ఆనందంలో హాట్ ట్రీట్ ఇచ్చిన నేషనల్ క్రష్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సక్సెస్ జోరులో ఉంది. ఈ నెలలోనే వరుసగా రెండు విజయాలు అందుకుంది. దీంతో ఆనందంలో సందడి చేస్తుంది. తాజాగా ముంబాయిలో సందడి చేసింది రష్మిక. కెమెరాకి చిక్కగా, ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రష్మిక మందన్నా(Rashmika Mandanna) నెటిజన్లకి హాట్ ట్రీట్ ఇచ్చింది. ముఖ్యంగా తన థండర్ థైస్తో కనువిందు చేసింది. పొట్టి స్కర్ట్ లో అందాల విందు చేస్తూ కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది. థైస్ ట్రీట్తో తన ఫాలోవర్స్ కి చెమటలు పట్టిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.
రష్మిక తాజా ముంబయిలో సందడి చేసింది. అక్కడ `మిషన్ మజ్ను` చిత్ర సక్సెస్ పార్టీలో పాల్గొంది. బాంద్రాలోని ఓ స్టార్ హోటలో శుక్రవారం రాత్రి నిర్వహించిన `మిషన్ మజ్ను` చిత్ర బృందం పాల్గొంది. ఇందులో రష్మిక హైలైట్గా, స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవడం విశేషం. పార్టీ మొత్తానికి సందడి తీసుకొచ్చింది.
అయితే ఇందులో ఆమె పొట్టి స్కర్ట్ లో దర్శనమిస్తూ గ్లామర్ షో చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీనికితోడు ఆమె ఫోటోలకు చిలిపి పోజులిచ్చింది. లవ్ సింబల్ ఇస్తూ రచ్చ చేసింది. అంతేకాదు హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతోనూ కలిసి లవ్ సింబల్ పోజులిస్తూ అదరగొట్టిందీ నేషనల్ క్రష్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
రష్మిక మందన్నా నటించిన రెండో చిత్రం `మిషన్ మజ్ను`. ఆమె ఒప్పుకుని మొదటి సినిమా ఇదే. ఆ తర్వాత సైన్ చేసిన `గుడ్ బై` మూవీ ఇప్పటికే విడుదలై పరాజయం చెందింది. కానీ లేటెస్ట్ మూవీకి మంచి స్పందన లభిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో యూనిట్ సెలబ్రేట్ చేసుకుంది.
ఇదిలా ఉంటే రష్మిక మందన్నా సక్సెస్ జోరులో ఉందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి `వారసుడు`తో మెప్పించింది. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా, సంక్రాంతి కావడంతో బాగానే వసూళ్లని రాబట్టింది. రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. దీంతో ఆ మధ్య `వారసుడు` సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఇందులో హీరో విజయ్ కూడా పాల్గొనడం విశేషం. ఇప్పుడు `మిషన్ మజ్ను`తో మరో హిట్ ని అందుకుందనే చెప్పాలి. కొత్త ఏడాది రష్మికకి మంచి శుభారంభాన్నిచ్చింది.
రష్మిక మందన్న రెండేళ్ల క్రితం చేసిన `పుష్ప` చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అందులో `శ్రీవల్లి` పాత్రకి విశేష స్పందన రావడంతోపాటు ఆ పాత్ర ఇండియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. అంతేకాదు ఇతర దేశాల్లోనూ ఈ పాటలో రష్మిక డాన్సులను రీల్స్ చేసిన సందర్భాలున్నాయి. ఇలా అత్యంత క్రేజ్తో పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తుంది రష్మిక మందన్నా.
రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండతో లవ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ఆ మధ్య మాల్దీవులకు వెకేషన్కి వెళ్లినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ రూమర్స్ పై రష్మిక స్పందించింది. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. హద్దులు మీరితే ఊరుకోనని తెలిపింది. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.