రష్మిక అందాలు ...‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’
కన్నడ పరిశ్రమ నుంచి తెలుగుకు వచ్చి వరసగా ‘చలో..’ , ‘గీతగోవిందం’ అంటూ గిలిగింతలు పెట్టి.. ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’ లలో అదరకొట్టి, ‘సరిలేరు నీకెవ్వరు’ ,‘భీష్మ’తో భీబత్సం చేసింది రష్మిక మందన్నా. ‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ మహేష్బాబు పక్కన కళ్లతో హాభావాలు పలికించడమే కాదు..అభిమానుల గుండెల్లో తన అభినయంతో ఆమె చెరగని ముద్ర వేసుకొంది..ఆమె అందానికి జనం ఎంత దాసోహం అయ్యారో, అంతకు మించి ఆమె ఎక్సప్రెషన్స్ కు మైమర్చిపోతున్నారు. ఆమెను సినిమాలోకి తీసుకుంటే సగం సక్సెస్ వచ్చేసినట్లే అని హీరోల,దర్శకులు ఫీల్ అవుతున్నారు. రికమెండ్ చేస్తున్నారు. నిర్మాతలు అయితే రష్మిక కోసం సంవత్సరాల తరబడి అడ్వాన్స్ పట్టుకుని వెయిట్ చేయమన్నా చేసేటట్లు ఉన్నారు. అయితే లాక్ డౌన్ పీరియడ్ లో రష్మిక అందరిలాగే ఇంటికి పరిమితం అయ్యింది. మరి అభిమానులను నిరాశపరచయం ఎందుకు అనుకుంటోందో ఏమో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొన్ని ఫొటోలు వదులుతోంది. వాటిపై ఓ లుక్కేయండి. చాలా ఫొటోలు మీరు గతంలో చూడనవే ఉంటాయి.
కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని విజయ్పేట్లో జన్మించిన రష్మిక విద్యాభ్యాసమంతా కర్ణాటకలోనే సాగింది. కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఆమె.
ఆ తర్వాత.. ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. పద్దెనిమిదేళ్లకే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.
చారుశీలగా గుర్తింపు పొందిన రష్మిక మందాన టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్ గా వరుస చిత్రాలను చేస్తోంది.
ఈ ఏడాదిలో ఈమె రెండు సినిమాలతో వచ్చింది. ఆ రెండు సినిమాలు సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఈ ఏడాదిలో కనీసం ఒక్క సినిమా కూడా విడుదల చేయలేక పోయిన హీరోయిన్స్ ఉన్నారు. అలాంటిది కరోనా ఇయర్ గా ముద్రపడ్డ 2020 లో రష్మిక రెండు సినిమాలతో సక్సెస్ దక్కించుకోవడం విశేషమే.
అంతేకాదు ప్రస్తుతం పుష్ప వంటి భారీ పాన్ ఇండియా సినిమా చేతిలో ఉంది. అల్లు అర్జున్ తో చేస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్ ని మరో మెట్టుకు తీసుకెళ్తుందని భావిస్తోంది.
తాను గతంలో ఇంత అందంగా ఉండేదాన్ని కాదని,. నాకు ఎప్పుడు ఏదో ఒక చర్మ సమస్య ఉండేది. దాంతో చర్మ పాలిపోయినట్లుగా ఉండటంతో పాటు జీవం కోల్పోయినట్లుగా నా చర్మం కనిపించేది.
ఆ సమయంలో నేను చర్మంకు సంబధించిన పరీక్షలు చేయించగా నాకు స్కిన్ ఎలర్జీ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ సమయంలో నేను చర్మంకు సంబధించిన పరీక్షలు చేయించగా నాకు స్కిన్ ఎలర్జీ ఉన్నట్లుగా గుర్తించారు. అప్పటి నుండి స్కిన్ ఎలర్జీ కి కారణం అయ్యే అన్ని ఆహారపు పదార్థాలను వదిలేశాను.
నాది చాలా సాధారణమైన జీవితం. షాపింగ్కు ఎక్కువగా డబ్బులు ఖర్చుపెట్టను. నాకు ఎప్పుడైనా కోపం వస్తే ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి షాపింగ్ చేస్తాను అంటారామె.
ఇక దుస్తుల విషయంలోనూ సంప్రదాయ దుస్తులను ఎక్కువగా ఇష్టపడుతాను. ఖాళీ లభిస్తే టీవీ, పుస్తకాలతోనే ఎక్కువ సమయం గడుపుతాను. యానిమేటెడ్ కార్టూన్, చైతన్యపరిచే పుస్తకాలను ఎక్కువగా చదువుతాను.
అలాగే...మీకు తెలుసా.. నన్నందరూ తెలుగమ్మాయి అనుకుంటున్నారు. నేను కూడా అచ్చు తెలుగు అమ్మాయిలాగానే ఉండటమే కాదు బాగా మాట్లాడుతున్నాను కూడా. మొన్నటి సినిమాలో డబ్బింగ్ కూడా నేనే చెప్పుకున్నాను. తెలుగు మాట్లాడుతుంటే కన్నడ మాట్లాడినట్లుగానే ఉంటోంది అని చెప్పుకొచ్చింది.
సినిమాల్లో అవకాశం రాకుంటే ఖచి్చతగా ఫిట్నెస్, క్రీడలకు సంబంధించి వ్యాపారంలోకి అడుగుపెట్టేదానిని. లేదంటే సైకియాట్రిస్టుగా చేసేదానిని.
సమయం లభిస్తే ఎక్కువగా జిమ్లోనే గడుపుతాను. సినిమాల్లోకి రాకముందు ఎక్కువ సమయం అక్కడే ఉండేదానిని. ఇప్పుడు సమయం తగ్గడంతో రోజు గంటపాటు జిమ్కు కేటాయిస్తున్నాను.
ప్రేమ చిహ్నమైన చారి్మనార్ గురించి విన్నాను. అయితే అక్కడికి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా కుదరడం లేదు. ఏదో ఒక రోజు అర్ధరాత్రి బురఖా వేసుకొని చూసి వస్తాను. గోల్కొండ కోట కూడా చూడాలని ఉంది.
ఇక కరోనాతో ఇంట్లో ఉంటూ రష్మిక ఖాళీగా ఉంటోంది అనుకోవద్దు. కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు చేరువవుతుంది.
తాజాగా అమ్మడు ఓ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసినట్లుంది. 'జస్ట్ ఫర్ విమెన్' మ్యాగజైన్ కోసం షూట్లో పాల్గొంది రష్మిక. ఆ ఫోటోలో అమ్మడి గ్లామర్ షో అదిరిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు తన కెరీర్ లో అన్నీ బబ్లీ క్యారెక్టర్స్ చేసిన రష్మిక త్వరలోనే ఓ ఛాలెంజింగ్ రోల్ చేయనుంది. అది ఎందులోనో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న 'పుష్ప' సినిమాలో.
ఈ సినిమాలో రష్మిక చిత్తూరు అమ్మాయిగా నటించనుంది. అందుకని అక్కడి బాషా యాస నేర్చుకోవలసి ఉంది. పుష్ప సినిమా పై అమ్మడు చాలా ఆశలే పెట్టుకుంది.
ప్రస్తుతం రష్మిక కూడా వ్యక్తిగత వ్యవహారాల రూమర్లతో విసిగిపోయి ఉందట. 'మనిషి అన్నాక వ్యక్తిగత సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అది సెలెబ్రిటీ అయితే అవి వార్తలుగా మారుతాయి. వాటిని బేస్ చేసుకుని అనేక పుకార్లు పుట్టుకొస్తాయి. అలాంటి పుకార్లని అసలు పట్టించుకోను. ఎందుకంటే నాకు అంత తీరిక లేదు" అంటోంది.
ఇక లాక్ డౌన్లో అమ్మడు తన మంచి మనసు చాటుకుంటుందట. రష్మిక ఆమె తండ్రి సిబ్బందికి.. అంటే దాదాపు ఇరవై మందికి నాలుగు నెలలుగా జీతాలు అందిస్తుందట.
దీని పై రష్మిక మాట్లాడుతూ.. మేమంటే ఉండగలం. కానీ మా స్టాఫ్ పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే వర్క్ స్టార్ట్ అయ్యేవరకు వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తాం" అని చెప్తోంది.
హైదరాబాద్లో లగ్జరీ లైఫ్ బాగా పెరిగింది. పబ్ కల్చర్ బాగా ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్లోని ఒక రోడ్డు చూశాను. అమెరికా, ఆస్ట్రేలియా నగరాల్లో ఉన్నటువంటి లగ్జరీ కనిపించింది.
కాలేజీలో ఉన్న టైమ్ లో ఫ్రెష్ ఫేస్ పేరుతో నిర్వహిస్తున్న ఆడిషన్స్కు నాకు తెలియకుండానే కాలేజి లెక్చరర్ నా పేరు ఇచ్చారు. అలా కాలేజ్ కార్యక్రమంలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచాను.
అక్కడి నుంచి బెంగుళూరులోనే అన్ని కళాశాలలకు చెందిన విజేతలతో నిర్వహించిన పోటీలోనూ ప్రథమస్థానం దక్కించుకొన్నాను. ముంబైలో జరిగిన ఫైనల్స్లో వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన కళాశాల యువతులతో పోటీ పడి టైటిల్ సాధించాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన.
నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఎలాంటి స్వీట్ ఇచ్చినా తినేస్తాను. అయితే సినిమాల్లోకి వచ్చాక స్వీటు జోలికి వెళ్లనివ్వడం లేదు. ముట్టుకోనివ్వడం లేదు. మరో విషయం ఏమంటే ఎనిమిది నెలల నుంచి మాంసాహారం ముట్టుకోవడం లేదు. ఇప్పుడు నేను పూర్తి శాకాహారిని. మనతోటి జంతువులను కోసుకొని తినడం నచ్చకనే నేను మాంసాహారం వదిలేశాను.