రష్మి గౌతమ్ డబుల్ ట్రీట్.. వాయిలెట్ కలర్ డ్రెస్లో కిర్రాక్ పోజులు.. వీకెండ్ స్టఫ్ అదిరింది..
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్.. ఓ వైపు గ్లామర్ ఫోటో షూట్లతో, మరోవైపు ఆమె పెట్ ప్రియురాలిగా నెటిజన్లని అలరిస్తుంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
జబర్దస్త్ షో తో పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. స్టార్ యాంకర్గా రాణిస్తుంది. పదేళ్లు దాటినా జబర్దస్త్ ని వీడకుండా కమిట్మెంట్తో ఉంటుంది. తనదైన స్టయిల్లో అలరిస్తుంది. ఆనందింప చేస్తుంది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hmm10agmc9nzd6k2ax6xvzy2/snapinsta-app-419905793-925351592665486-6648281196156970921-n-1080-jpg_300x374xt.jpg)
రష్మి గౌతమ్ ఎప్పటికప్పుడు అందాల ఫోటోలతో అలరిస్తుంది. మరోవైపు పంచ్లు, సెటైర్లతో మెప్పిస్తుంది. స్టేజ్పై డాన్సులతో ట్రీట్ ఇస్తుంటుంది. అన్ని యాంగిల్లో ఆమె కవ్వింపు చర్యలు చేస్తూ ఎంగేజ్ చేస్తుంది. అందుకే ఈ షోకి యాంకర్గా కొనసాగుతుంది.
రష్మి గౌతమ్.. ప్రస్తుతం `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవీ డ్రామా కంపెనీ` షోలకు యాంకర్గా చేస్తుంది. ఒక కామెడీ షో. మరోటి ఆల్ మిక్స్ షో. నవరసాల మేళవింపుగా ఉంటుంది.
ఇలా ప్రతి వారం డబుల్ ట్రీట్ ఇచ్చినట్టుగానే ఇప్పుడు తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఆమె వాయిలెట్ కలర్ డ్రెస్లో మెరిసింది. అంతేకాదు మిర్రర్లో పోజులిస్తూ మత్తెక్కిస్తుంది.
రష్మి గౌతమ్.. మిర్రర్ ముందు నిలబడి కెమెరాకి పోజులిచ్చింది. దీంతో ఆమె రెండు సార్లు కనిపించింది. తనతోపాటు ప్రతిబింబం కూడా ఆవిషృతం అయ్యింది. ఆ ఫోటోలు ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ నిస్తున్నాయి.
ఇక వీకెండ్ సందర్భంగా ఆమె ఈ ఫోటోలను పంచుకుంది. దీంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. వీకెండ్ స్టప్ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్మి గౌతమ్.. పెట్ డాగ్స్ విషయంలో చాలా కేరింగ్గా ఉంటుంది. జంతు ప్రేమికురాలిగా రాణిస్తుంది. ఏ కుక్కని ఏమైనా తను తట్టుకోలేదు. రియాక్ట్ అవుతుంది. సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తుంది.
తాజాగా మరో రెండు రోజుల్లో ఆయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు దీన్ని నెగటివ్గా కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల కోసం ఇది ఓట్ల స్టంట్లు అంటూ కామెంట్ చేస్తున్నారు.
దీనిపై రష్మి స్పందిస్తూ కౌంటర్లిస్తుంది. ఇప్పటికీ ఇలాంటి ఆలోచనలు ఉన్నవారి పట్ల ఆమె అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. మనం పాకిస్తాన్ కాదంటూ కామెంట్ చేసింది.
మన రాముడిని, మన ట్రెడిషన్ని గౌరవించాలని, పాటించాలని ఆమె తెలిపింది. ఇన్నాళ్లకి భారతీయుల కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని రష్మి చెప్పింది.