`మగధీర` టైమ్లో కాజల్తో చాలా ఇబ్బంది పడ్డా.. ఎన్టీఆర్తో చెప్పి షాకిచ్చిన రామ్చరణ్.. అసలేం జరిగిందంటే?
మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఓ షాకింగ్ విషయం వెల్లడించాడు. `మగధీర` టైమ్లో కాజల్తో ఇబ్బంది పడ్డ విషయాన్ని ఇన్నాళ్లకి రివీల్ చేశాడు. ఎన్టీఆర్ ముందు ఆ సంఘటన పంచుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇంతకి ఏం జరిగిందంటే?
ఎన్టీఆర్ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షో నేడు(ఆదివారం) రాఖీ సందర్బంగా ప్రారంభమైంది. షో చాలా సింపుల్గా ప్రారంభమైంది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ప్రారంభించారు ఎన్టీఆర్. మొదటగా శ్రీ శ్రీ వ్యాఖ్యలు చెప్పి అందరి మనసులను దోచుకున్నారు.
Evaru meelo koteeswarulu
గతంలో మాదిరిగానే `ఎవరు మీలో కోటీశ్వరులు` షో సాగింది. ఎలాంటి మార్పులు లేకుండా అవే నిబంధనలతో షో సాగుతుందనే విషయాన్ని ఎన్టీఆర్ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ షోకి తొలి గెస్ట్ గా రామ్చరణ్ పాల్గొనడంతో షోకి స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. ఎందుకంటే వీరిద్దరు కలిసి `ఆర్ఆర్ఆర్` నటిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ ఆసక్తికరంగా మారింది.
ఇందులో సెలబ్రిటీలు గెలుచుకునే మనీ సొంతంగా వాడుకోకూడదని, ఛారిటీ కోసం ఆడాలని చెప్పగా, `కరోనా క్రైసిస్ ఛారిటీ`(సీసీసీ) కోసం ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని విరాళంగా అందిస్తామన్నారు చరణ్.
ఎన్టీఆర్తో సాగిన గేమ్లో తన పర్సనల్గా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు చరణ్. తన వద్ద గతంలో ఆరు డాగ్స్ ఉండేవన్నారు. ఓ పెద్ద డాగ్ ఉండేదని తెలిపారు. అది చాలా స్పెషల్ అని చెప్పారు.
మరోవైపు తన వద్ద గుర్రాలు కూడా ఉన్నాయని, అందులో ఒక దాని పేరు బాద్షా అని తెలిపారు. అది `మగధీర` టైమ్లో ఉపయోగించమన్నారు. దీంతోపాటు మరో గుర్రం ఉండేదని, దాని పేరు కాజల్ అన్నారు. అది తన ఫ్రెండ్ ఇచ్చాడని, అతను చనిపోయే ముందు తనకు గిఫ్ట్ గా ఇచ్చాడని, అది తనకు చాలా స్పెషల్ అని చెప్పాడు.
అయితే `మగధీర` సినిమా టైమ్లో ఆ గుర్రాన్ని ఉపయోగించామని, అయితే సినిమాలో హీరోయిన్ కూడా కాజలే కావడం, తన గుర్రం పేరు కూడా కాజల్ కావడం చాలా ఇబ్బంది అయ్యిందని, దాన్ని పిలిచే విషయంలో మరింతగా ఇబ్బంది పడ్డామని తెలిపాడు రామ్చరణ్. ఇది నవ్వులు పూయించింది.
ప్రస్తుతం రామ్చరణ్, ఎన్టీఆర్ కలిసి `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అలియాభట్, ఒలివీయా మోర్రీస్ హీరోయిన్లుగా, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ దసరాకి విడుదల కావాల్సి ఉంది. కానీ వచ్చే ఏడాది సమ్మర్కి విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.