సీనియర్ జర్నలిస్ట్పై యుద్ధం ప్రకటించిన ఆర్జీవీ.. బాలీవుడ్ ఒక్కటి కావాలంటూ!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవేశంగా మాట్లాడిన, ట్వీట్ చేసిన సందర్భాలు కనిపించవు. ఎంత పెద్ద వివాదాన్ని అయిన సింపుల్గా టాకిల్ చేస్తుంటాడు ఆర్జీవీ. అయితే తాజాగా బాలీవుడ్పై విమర్శలు చేసిన జర్నలిస్ట్ అర్నన్ గోస్వామిపై విరుచుకుపడ్డాడు వర్మ. వరుస ట్వీట్లతో అర్నబ్పై యుద్ధం ప్రకటించాడు.
టీవీ డిబెట్లో బాలీవుడ్పై అర్నబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. `అర్నబ్ గోస్వామి బాలీవుడ్ గురించి అంత దారుణంగా మాట్లాడటం చూసి షాక్ అయ్యాను. ఆయన బాలీవుడ్ను నీచమైన ఇండస్ట్రీ అన్నాడు. ఇండస్ట్రీకి క్రిమినల్ కనెక్షన్స్ ఉన్నాయని, ఇండస్ట్రీలో రేపిస్ట్లు, గ్యాంగ్స్టర్లు, సెక్సువల్ ఎక్స్ప్లాయిటర్స్ ఉన్నారని ఆరోపించాడని` వర్మ ట్వీట్ చేశాడు.
అర్నబ్ కామెంట్స్ నాకు తీవ్ర వేదన కలిగించాయి. ఆయన దివ్య భారతి, జియా ఖాన్, శ్రీదేవి, సుశాంత్ ల మరణాలను ఒకే కేసుల చూస్తున్నాడు. ఆ నలుగురిని బాలీవుడ్ ఇండస్ట్రీ హత్య చేసిందని భావిస్తున్నాడు. ఆ నాలుగు మరణాలు 25 ఏళ్ల స్పాన్లో జరిగాయి.
ఈ నాలుగు కేసుల్లో దివ్య, జియా, సుశాంత్లు నలుగురు విభిన్న వ్యక్తులు, విభిన్న పరిస్థితులు. కానీ అర్నబ్ బుర్రలో మాత్రం వాళ్లంతా ఒక్కటే వారిని చంపింది బాలీవుడ్.
మెగా స్మార్ట్ అర్నబ్ను నేను ఏం అడుగుతున్నా అంటే.. బాలీవుడ్ విల్లే పార్టే స్మశానంలోని సమాధిలో నిద్రపోయే ప్రేతం, రక్తం తాగలి అనిపించినప్పుడల్లా ఆ భూతం బయటకు వచ్చి మనుషులను చంపుతుంది అని అనుకుంటున్నావా..?
ఆదిత్య చోప్రా, కరణ్ జోహర్, మహేష్ భట్, షారూక్, సల్మాన్ ఖాన్లతో పాటు మిగతా అంతా అర్నబ్ అరుపులకు బయపడి తమ ఆఫీస్ టేబుల్ల కిందా దాక్కున్నారా..?
కనీసం ఇప్పటికైన ఇండస్ట్రీ జనాలంతా బయటకు వచ్చి అర్నబ్ గోస్వామి గురించి ఓపెన్గా మాట్లాడాలి. ఓ కుక్క వెంట పడుతుంటే పారిపోయే జింక లాగా కాకుండా ఎదిరించి నిలబడాలి.
అర్నబ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. అందుకే నేను ఆయన మీద సినిమా తీయాలని ఫిక్స్ అయ్యా. ఆ ముసుగు వెనక ఉన్న అసలు నిజాలను నగ్నంగా చూపిస్తా. ఆయన అవినీతి లెక్కలను కూడా బయటపెడతా.
అర్నబ్ మీద నేను చేయబోయే సినిమా పేరు `అర్నబ్.. ద న్యూస్ ప్రొస్టిట్యూట్` ఆయన గురించి ఎంతో స్టడీ చేసిన తరువాత ఈ ట్యాగ్ లైన్ ఇచ్చాను. న్యూస్ పింప్, లేదా న్యూస్ ప్రాస్టిట్యూట్ అన్న విషయంలో చాలా ఆలోచించిన తరువాత ప్రాస్టిట్యూట్ అన్న సౌండ్ కారణంగా దాన్నే ఫిక్స్ చేశాను.
నాకు తెలుసు నేను.. నా ట్వీట్స్లో నేను అభ్యంతరకర భాష వాడాను. కానీ నేను ఆ వ్యాఖ్యలు మనకు బాగా తెలిసిన అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసే అర్నబ్ నుంచే తీసుకున్నాను.
చివరగా ఆదిత్య చోప్రా, కరణ్ జోహర్, మహేష్ భట్, షారూఖ్, సల్మాన్లతో పాటు ఇంకా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులకు, మీరు తెర మీద హీరోలను తయారు చేయటం, హీరోలు అనిపించుకోవటం కాదు, అర్నబ్ లాంటి విలన్ వచ్చినప్పుడు అంతా కలిసికట్టుగా ఎదురు నిలబడాలి` అంటూ వరుస ట్వీట్లతో హోరెత్తించాడు వర్మ.