సినిమా అని ఊరించి చివరకు బట్టలమ్ముతున్న రామ్ చరణ్, రష్మిక.. ఏంటీ ఇలా అయిపోయారు?
రామ్ చరణ్, రష్మిక మందన్నా కలిసి ఓ సినిమా చేయబోతున్నారని అంతా భావించారు. త్వరలోనే రాబోతుంటూ పోస్టర్లు పడ్డాయి. కానీ తీరా చూస్తే బట్టలమ్ముతూ మైండ్ బ్లాక్ అయ్యేలా షాకిచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్చరణ్(Ram Charan) ప్రస్తుతం శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. కానీ ఊహించిన విధంగా ఆయన `మెగా బ్లాక్బస్టర్` అంటూ పోస్టర్లని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇందులో స్టారింగ్రామ్చరణ్ అని కూడా వేయడంతో మరో సినిమా చేస్తున్నారని అనుకున్నారు. కాసేపు ఊరించారు.
అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) సైతం ఇదే పోస్టర్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తనే స్టార్ అంటూ పంచుకుంది. గతకొన్ని రోజులుగా ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ తీరా చూస్తే సీన్రివర్స్ అయ్యింది.
`మెగా బ్లాక్ బస్టర్` కాస్త `మీషో` సేల్గా మారడం గమనార్హం. దీంతో రష్మిక, రామ్చరణ్ అభిమానులంతా షాక్ అయ్యారు. ఓ యాడ్ కోసం ఇలా చేశారా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇందులో ఈస్టార్స్ బట్టలమ్ముకోవడం అందరికి షాక్కి గురి చేస్తుంది.
ఆన్లైన్ షాపింగ్ యాప్ మీషో సరికొత్త యాడ్కి తెరలేపింది. సౌత్, నార్త్ సినీ తారలు, క్రికెట్ సెలబ్రిటీలతో ఓ బిగ్గెస్ట్ యాడ్ చేసింది. `మెగా బ్లాక్ బస్టర్` అంటూ పోస్టర్ ప్రకటించింది. ఇందులో ఎవరికి వారు పేర్లని స్టారింగ్గా వేయడం విశేషం. దీంతో అందరూ ఆశ్చర్యాపోయారు. ఇందులో రామ్చరణ్, రష్మిక మందన్నాతోపాటు కార్తి, త్రిష, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనె, అలాగే క్రికెటర్లు రోహిత్ వర్మ, గంగూలీ సైతం ఉండటం నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ అయ్యింది. వీరంతా కలిసి సినిమా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తీరా చూస్తే అది యాడ్ కావడం విశేషం.
ఈ బిగ్గెస్ట్ స్టార్లతో మీషో యాడ్ చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. అంతేకాదు ఇందులో రామ్చరణ్, రష్మిక మందన్నాలు బట్టలమ్ముతున్నారు. రండి రండి దయజేయండి, మంచి సేల్ ఉంది, అన్ని రకాల డ్రెస్సులున్నాయంటే కస్టమర్లని షాపుల ముందు ఆహ్వానిస్తుండటం మరింత ఆశ్చర్యపరుస్తుంది. దీంతో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. సినిమా అని చెప్పి చివరకు బట్టలమ్ముతున్న రామ్చరన్, రష్మిక అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రెండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ యాడ్ అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన సెలబ్రిటీలుండటంతో దీనికి విశేష ఆదరణ దక్కుతుంది.ఈ యాడ్ ట్రెండ్ అవుతుంది. ఇక రామ్చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `ఆర్సీ15`లో నటిస్తున్నారు. ఇది షూటింగ్కి గ్యాప్ ఇచ్చారు. ఇక రష్మిక `పుష్ప`, `వారసుడు`తోపాటు మూడు హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.