మాల్దీవుల్లో కాజల్, రకుల్, తాప్సీ, సమంత, దిశా, సోనాక్షి.. సేదతీరుతూ అందాల ఆరబోత..
మాల్దీవ్ ఐలాండ్ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ తారల అందాలతో ముగ్దురాలవుతుంది. ఈ బ్యూటీస్ ఆరబోస్తున్న అందాలకు మెస్మరైజ్ అవుతుంది. ప్రస్తుతం పది మంది వరకు తారలు మాల్దీవుల్లో సేదతీరుతున్నారు. దీంతో స్టార్స్ కి ఈ ద్వీపకల్పం అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ఆ ముద్దుగుమ్మలెవరో ఓ లుక్కేద్దాం.
లాక్ డౌన్ ముగిసిన తర్వాత సేదతీరేందుకు, ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ముందుగా విదేశాలు బయలు దేరింది సొట్టబుగ్గల సుందరి తాప్సీ.
మాల్దీవులకు వెళ్ళి సేద తీరింది. ఈ సందర్భంగా తాను పంచుకున్న ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వెకేషన్ని పూర్తి చేసుకుని షూటింగ్లోనూ పాల్గొంటుంది తాప్సీ.
ఇక కొత్తగా పెళ్ళి చేసుకున్న కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు.
తోటి కథానాయికలు కుళ్లు పడేలా భర్తతో కలిసి తెగ ఎంజాయ్ చేసింది కాజల్. బీచ్లో పోజులిస్తూ కనువిందు చేశారు.
అంతేకాదు ఏకంగా సముద్రంలోనే హనీమూన్ ఏర్పాటు చేసుకుని ఘాటు రొమాన్స్ కి తెరలేపింది.
బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా సైతం హాట్ అందాలను ఆరబోసింది. మాల్దీవులకు చెక్కేసి సేదతీరుతుంది.
ఇక `లోఫర్` చిత్రంతో టాలీవుడ్కి పరిచయమై, బాలీవుడ్లో సెటిల్ అని క్రేజీ హాట్ బ్యూటీ దిశాపటానీ మాల్దీవుల్లో అందాలను ఆరబోసింది.
బికినీలో బీచ్ వెంట రిలాక్స్ అయ్యింది. దిశా బికినీ ఫోటోస్ సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచడం విశేషం.
దిశా ప్రియుడు, హీరో టైగర్ షరాఫ్ సైతం మాల్దీవుల్లో సేద తీరారు. ఆయన ఎల్లో షార్ట్ ధరించి పోజులిచ్చారు.
మరో హీరోయిన్ తారా సుతారియా సైతం మాల్దీవుల్లో రిలాక్స్ అవుతుంది.
ఈ బ్యూటీ కూడా బికినీ పోజులో తన అభిమానుల హీట్ పెంచుతుంది.
ఇక టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తన ఫ్యామిలీతో కలిసి మాల్డీవులకు వెళ్ళింది. తన సోదరుడితో కలిసి సాయంకాలం వేళ సెల్ఫీ దిగింది.
అంతేకాదు అక్కడ కూడా యోగా వదల్లేదు. తాను ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యోగా వదలనని తెలిపింది.
అక్కడ బికినీలో అందాలను ఎరగా వేసి మాల్దీవులకే కొత్త అందాలను తీసుకొచ్చింది.
అంతేకాదు బికినీలో సముద్రం మధ్యలో తన అందాలను సూర్యకిరణాలు ముద్దాడుతున్న వేళ అందాలను ఆరబోసింది.
బికినీ అందాలు ఆమె అభిమానులను కనువిందు చేశాయి.
ఇప్పుడు నాగచైతన్య, సమంత సైతం మాల్దీవుల్లో చెక్కర్లు కొడుతున్నారు. నిన్న చైతూ బర్త్ డేని మాల్దీవుల్లో జరుపుకున్నారు.
అక్కడ సమంత స్కూబా డ్రైవ్ చేసి తన కోరికను తీర్చుకుంది.
వీరితోపాటు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి కూడా మాల్దీవుల్లోనే సేద తీరుతున్నారు.