ఈ భంగిమలలో రకుల్ ని చూస్తే మతిపోతుంది
ఫిట్నెస్ కు ఫ్రిఫరెన్స్ ఇచ్చే తెలుగు హీరోయిన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది రకుల్ ప్రీతి సింగ్. ఈ భామ దక్షిణాదిలో చాలా చిత్రాల్లో నటించి పెద్ద స్టార్ హీరోయిన్ అంతస్తును పొందానని చెప్పుకుంది. సీనియర్ హీరోల నుంచి వర్ధమాన హీరోల వరకూ జతకట్టానని చెప్పింది.ఆమె అందంతో పాటు ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆడైనా,మొగైనా ఎంత అందంగా ఉంటారో అంతే ఫిట్గా కనిపింటారామె. అలాగే రకుల్ ఫిట్నెస్కు ఇచ్చే ప్రాధాన్యత ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లకు బాగా తెలుసు. రకరకాల వ్యాయామాలు చేస్తూ, యోగాసనాలు వేస్తూ వాటిని ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్స్టాగ్రామ్లో రకుల్ పోస్ట్ చేస్తూ ప్రేరణగా నిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ప్రస్తుత మోడర్న్ యుగంలో హీరోయిన్లుగా సుధీర్ఘంగా కొనసాగాలి అంటే ఫిట్గా ఉండటం తప్పనిసరి అనేది ఆమె పాలసి. అందుకే, రకుల్ తన ఫిజిక్ను కాపాడుకోవడం కోసం జిమ్లలో తెగ కష్టపడుతుంటుంది. తాజాగా ఆమె వేసిన యోగాశనాలు ఇనిస్ట్రాలో వైరల్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..
రకుల్ తన చిన్నతనం నుంచే అంటే 1993 నుంచి యోగా సాధన చేస్తోంది. అందుకు సంభందిన ఫోటోలను ఆ మధ్యన వదిలింది. విమర్శలను పట్టించుకుంటే అనుకున్న పనిఅవుతుందా? అందుకే నటి రకుల్ప్రీత్సింగ్ మాత్రం ఇంటర్వ్యూలు, ఫొటోలు అంటూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేసుకుంటోంది.
రకుల్కు యోగాపై చిన్ననాటి నుంచి ఎంత ఆసక్తి ఉంది. లాక్డౌన్లో షూటింగ్లు లేకపోవడంతో సమయాన్ని వృథా చేయకుండా వినూత్న రీతిలో యోగాసానాలు వేస్తూ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.
ఇక లాక్డౌన్లో ముంబైలో కుటుంబంతో సరదాగా గడిపిన రకుల్.. వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ, వర్కౌట్స్తోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇటీవల రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని యోగాసానాల ఫోటోలను అందరికీ తెగ నచ్చేస్తున్నాయి
రకుల్ ప్రీత్ సింగ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరితో నటించేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా తాజాగా బిజినెస్ వైపు అడుగులు వేసింది.
ఇప్పటికే జిమ్ బిజినెస్ను మొదలుపెట్టిన రకుల్.. మరిన్ని బ్రాంచ్ లను ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందట.అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెడుతోందట.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం పల్లెటూరి అమ్మాయిగా మారిపోయారు రకుల్ ప్రీత్సింగ్. ఈ సినిమాలో రకుల్ పాత్ర డీ గ్లామరైజ్డ్గా ఉంటుంది కూడా. అంటే మేకప్ లేకుండా కనిపించనున్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి.. డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈ ముంబై బ్యూటీ హిందీ, తమిళం సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా, తెలుగులో మాత్రం కొంత కాలం బాగానే ఏలింది.
అయితే ఇప్పుడు అక్కడ అవకాశాలు పూర్తిగా నిల్. దీంతో రకుల్ప్రీత్సింగ్ గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అదే ఈ అమ్మడికి చిర్రెత్తించింది.
అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేస్తున్న సమయంలో హైదరాబాద్లో మకాం పెట్టేసే ఆలోచనలో ఒక అందమైన ఇల్లును కూడా కొనేసుకుంది.అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారు కావడంతో టాలీవుడ్ నుంచి మూటాముల్లె సర్దుకునే పనిలో భాగంగా అక్కడ ఇంటిని అమ్మేసుకుందని, బెంగళూర్లో కొత్తగా ఇల్లు కొనుక్కుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
‘జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లినప్పుడే మనల్ని మరిన్ని విజయాలు పలకరిస్తాయి’ అంటున్నారు రకుల్ప్రీత్ సింగ్.
దక్షిణాదిలో అగ్రకథానాయిక జాబితాలో దూసుకెళుతున్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్లోనూ మంచి జోరు మీద ఉన్నారు. జీవితంలో తనకు ఎదురయ్యే వైఫల్యాలను సమర్దవంతంగా ఎదుర్కొంటమే తన సక్సెస్ అంటోంది.
రకుల్ మాట్లాడుతూ – ‘‘నేను చేయాలనుకున్న పనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో మొదలుపెడతాను. నాపై నాకు నమ్మకం ఎక్కువ. అది ఆత్మవిశ్వాసమే. కానీ మితిమీరిన విశ్వాసం కాదు. ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు జీవితంలో వైఫల్యాలు మనల్ని పలకరిస్తాయి.
అలాంటప్పుడు జీవితం పట్ల భయపడాల్సిన పని లేదు. అవి మన గురించి మనం ఆలోచించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. మన బలాలను గుర్తు చేస్తాయి. అపజయాలు మంచికే! అవి లేకపోతే మనం ఏమీ నేర్చుకోకుండా మిగిలిపోతాం. గమనించుకోవాలే కానీ వైఫల్యాల ద్వారానే మనకు జీవిత పాఠాలు బోధపడతాయి’’ అని పేర్కొన్నారు.
హిందీ చిత్రం ‘దేదే ప్యార్ దే’ విజయం రకుల్ప్రీత్ సింగ్కు బాలీవుడ్లో అవకాశాలను తెచ్చిపెడుతోంది. ఇందులో అజయ్ దేవగణ్ హీరోగా నటించారు. మళ్లీ అజయ్, రకుల్ప్రీత్ సింగ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
‘దే దే ప్యార్ దే’ హిట్తో హిట్ జోడీ అనిపించుకున్న అజయ్, రకుల్ మళ్లీ ఈ చిత్రంతో హిట్ అందుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ‘ధమాల్’ ఫ్రాంచైజీ డైరెక్టర్ ఇంద్రకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఇందులో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఓ హీరోగా నటిస్తారు.
యాక్షన్–కామెడీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుందట. మరోవైపు హిందీలో అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం చిత్రాల్లో కథానాయికగా నటించడంతో పాటు కమల్హాసన్ ’ఇండియన్ 2’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తూ రకుల్ ప్రస్తుతం ఫుల్ బిజీ.
బాలీవుడ్ ‘ఎటాక్’లో జాయిన్ అయ్యారు రకుల్ప్రీత్ సింగ్. జాన్ అబ్రహాం హీరోగా లక్ష్యరాజ్ దర్శకత్వంలో హిందీలో ‘ఎటాక్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రకుల్ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
2008లో ఢిల్లీలో జరిగిన ఓ ఉగ్రవాద దాడి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. ఇందులో ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు జాన్ అబ్రహాం. గత ఏడాది డిసెంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే
‘ఎటాక్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు అజయ్ దేవగన్–సిద్దార్థ్ మల్హోత్రా, అర్జున్ కపూర్ హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో రకుల్ కథానాయికగా చాన్స్ కొట్టేశారు. ఈ మూడు సినిమాలతో రకుల్ ఈ ఏడాది బాలీవుడ్లో బిజీ బిజీ.