అందాల భామల సైకిల్ సవారీ.. ఏకంగా 30 కి.మీ!
కరోన కారణంగా సినీ తారలకు చాలా ఖాళీ సమయం దొరికింది. ముందు కొద్ది రోజులు పాటు లాక్ డౌన్ సమయాన్ని హాలీడేస్లా ఇంట్లోనే ఎంజాయ్ చేసిన తారలు, తరువాత బోర్ ఫీల్ అవుతున్నారు. దీంతో కొత్త కొత్త వ్యాపకాలతో టైం పాస్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్లు ఓ సాహస యాత్ర చేశారు.
టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. సొంతంగా జిమ్లు కూడా నిర్వహిస్తున్న ఈ బ్యూటీ తన వర్క్ అవుట్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఈ భామ కొంత మంది స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రముఖ సైకిలిస్ట్ ఆదిత్యా మెహతా టీంతో కలిసి మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్లు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. 30 కిలో మీటర్ల సైక్లింగ్ చేసినట్టుగా రకుల్ వెల్లడించింది. హైదరాబాద్లోని సుచిత్ర ఎక్స్రోడ్ నుంచి తూఫ్రాన్ రోడ్ మీదుగా సైకిలింగ్ చేసినట్టుగా రకుల్ తెలిపింది.
ఈ ఫోటోలను ఆదిత్య టీం సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవి వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను రీ ట్వీట్ చేసిన రకుల్ త్వరలో 100 కిమీటర్ల సైక్లింగ్ కూడా చేస్తాం అంటూ కామెంట్ చేసింది.