ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చిన రజినీకాంత్, రిస్క్ చేస్తున్నాడా?
కూలి, జైలర్ 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ సీనియర్ హీరో.. తనకు ప్లాప్ సినిమాను ఇచ్చిన యంగ్ డైరెక్టర్ కు మరోసారి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మరి అందులో నిజం ఎంత?
- FB
- TW
- Linkdin
Follow Us
)
పిజ్జా సినిమాతో కోలీవుడ్లో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ సుబ్బరాజ్, ఇరైవి, జిగర్తాండా వంటి విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ 'పేట' చిత్రం ఆయనకు లభించిన మొదటి జాక్పాట్ అవకాశం. 2019లో విడుదలైన ఈ చిత్రం రజినీ అభిమానులను అలరించింది. తమిళంలో పర్వాలేదు అనిపించినా.. తెలుగులో మాత్రం పెద్దగా ఆధరణ లభించలేదు.
Also Read: 85000 ఖరీదైన షర్ట్ వేసుకున్న పాన్ ఇండియా తెలుగు హీరో, ఎవరో గుర్తు పట్టారా?
కార్తీక్ సుబ్బరాజ్, సూర్య
పేట తర్వాత ధనుష్, విక్రమ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజ్, తదుపరి సూర్యతో కలిసి పనిచేశారు. కంగువా సినిమా తర్వాత సూర్య నటించిన రెట్రో సినిమాకు కార్తీక్ సుబ్బరాజే దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సూర్య సొంత బ్యానర్ అయిన 2D ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రంలో సూర్యకు జోడిగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
Also Read: మహేష్ బాబు మిస్ అయ్యాడు, రామ్ చరణ్ హిట్ కొట్టాడు, ఏ సినిమానో తెలుసా?
కార్తీక్ సుబ్బరాజ్, రజినీకాంత్
సూర్య రెట్రో సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మళ్ళీ రజినీకాంత్ తో కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. పేట వచ్చిన సినిమా 6 సంవత్సరాల తర్వాత రజినీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి పనిచేయనున్నారనే వార్త కోలీవుడ్ లో వైరల్ అవుతోంది.
Also Read:ప్రభాస్ ను క్లైమాక్స్ లో చంపబోతున్న డైరెక్టర్, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇంతకీ ఆ సినిమా ఏంటి?
రజినీకాంత్
రజినీకాంత్ ప్రస్తుతం కూలి, జైలర్ 2 సినిమాలలో నటిస్తున్నారు. కూలి సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. జైలర్ 2 చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు చిత్రాలను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమాల తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ తో రజినీకాంత్ కలిసి పనిచేస్తారని అంచనా.