- Home
- Entertainment
- మహేష్ కోసం విలన్లుగా ఐదుగురు హీరోలు..? ఒకరినొకరు మించిపోతున్న రాజమౌళి, త్రివిక్రమ్..
మహేష్ కోసం విలన్లుగా ఐదుగురు హీరోలు..? ఒకరినొకరు మించిపోతున్న రాజమౌళి, త్రివిక్రమ్..
ఇటీవల హీరోలు విలన్ పాత్రలు చేయడం ట్రెండ్ అవుతుంది. చాలా సినిమాల్లో అలానే అలరిస్తున్నారు. మహేష్బాబు కోసం ఐదుగురు హీరోలు విలన్గా చేయబోతుండటం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అవుతుంది.

మహేష్బాబు బ్యాక్ టూ బ్యాక్ రెండు భారీ చిత్రాలు చేయబోతున్నారు. నెక్ట్స్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, రాజమౌళితో మరో సినిమా చేయనున్నారు. మాటల మాంత్రికుడు మహేష్తో చేయబోయే సినిమాకి`అర్జునుడు` అనే టైటిల్ వినిపిస్తుంది. పూజా హెగ్డేకథానాయికగా నటించబోతున్న ఈ సినిమా జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్లు రాబోతున్నట్టు సమాచారం.
ఈ చిత్రంలో విలన్ పాత్రలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇందులో ముగ్గురు విలన్ పాత్రలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. విలన్గా నటించే ఆ ముగ్గురు.. హీరోలు కావడం ఇప్పుడు మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. మహేష్ సినిమాలో మూడు బలమైన విలన్ పాత్రలు ఉండబోతున్నాయట. అందుకోసం హీరోలను విలన్ పాత్రల్లో నటింప చేయాలని భావిస్తున్నారట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.
ఈ సినిమాలో విలన్ పాత్రల కోసం సౌత్స్టార్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్లతో చర్చలు జరుపుతున్నట్టు టాక్. విజయ్ సేతుపతి హీరోగా, విలన్లుగా, కీలక పాత్రల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆయన స్థాయిలో బలమైన పాత్రలైతేనే విలన్గా చేస్తున్నారు. `ఉప్పెన`లో ఆయన విలన్గా నటించిన విషయంతెలిసిందే. మరోవైపు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కూడా విలన్గా చేస్తున్నారు. ఆయన `పుష్ప`లో ఇప్పటికే విలన్ టచ్ ఇచ్చారు. `పుష్ప2`ఓ పూర్తి విలన్గా కనిపించబోతున్నారు. మరోవైపు పృథ్వీరాజ్ హీరోగా, విలన్లుగా, దర్శకుడిగా రాణిస్తున్నారు.
ఈ ముగ్గురిని మహేష్తో చేయబోయే సినిమాలో విలన్లుగా తీసుకోవాలనుకుంటున్నారట త్రివిక్రమ్. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందని తెలుస్తుంది. తాను రూపొందించే చిత్రాల్లో సాధ్యమైనంత వరకు భారీ కాస్టింగ్ని తీసుకుంటారు త్రివిక్రమ్. పాత్ర నిడివితో సంబంధం లేకుండా కాస్టింగ్ ఉండేలా చూసుకుంటారు. సినిమాకి లావిష్నెస్ని తీసుకొస్తుంటారు. గ్రాండియర్గా మారుస్తుంటారు. మహేష్ సినిమాని పాన్ ఇండియా స్థాయి ఇమేజ్ని తెచ్చేందుకు త్రివిక్రమ్ ఈ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి ఈ ముగ్గురు స్టార్లు నటిస్తారా? లేదా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి సైతం హీరోలను విలన్లుగా మార్చబోతున్నారు. `ఈగ`లో స్టార్ హీరో సుదీప్ని విలన్ని చేశాడు. `బాహుబలి`లో రానాని విలన్ని చేశారు. ఇప్పుడు నెక్ట్స్ చేయబోతున్న మహేష్ సినిమాలోనూ ఓ స్టార్ హీరోని విలన్గా మార్చబోతున్నట్టు తెలుస్తుంది. తమిళ హీరో కార్తీని విలన్ పాత్రతతో పండించాలని భావిస్తున్నారట. తమిళం నుంచి కార్తీని, హిందీనుంచి మరో హీరోని విలన్ పాత్రల కోసం అడుగుతున్నారట. ప్రస్తుతం ఇది చర్చల్లో ఉందని సమాచారం.
ఇలా మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ ముగ్గురు హీరోలను, రాజమౌళి ఇద్దరు హీరోలను విలన్గా చూపించబోతున్నట్టు టాలీవుడ్లో చర్చ మొదలైంది. ఇదంతా పాన్ ఇండియా మార్కెట్ కోసమే అని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. ప్రస్తుతం ఈవార్తలు మాత్రం ఇంటర్నెట్లో ట్రెండు అవుతున్నాయి. ఇవే నిజమైతే కశ్చితంగా ఇవి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలవబోతున్నాయని చెప్పొచ్చు.