- Home
- Entertainment
- రాజమౌళి, ఎన్టీఆర్, రామ్చరణ్ లకు కీరవాణి వెన్నుపోటు.. అసలు విషయం బయటపెట్టి షాకిచ్చిన యాంకర్ సుమ
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్చరణ్ లకు కీరవాణి వెన్నుపోటు.. అసలు విషయం బయటపెట్టి షాకిచ్చిన యాంకర్ సుమ
`బాహుబలి`లో కట్టప్ప బాహుబలికి వెన్నుపోటు పొడిచాడనేది ఎంతగానో పాపులర్. కానీ `ఆర్ఆర్ఆర్`కి ఎంఎం కీరవాణి వెన్నుపోటు పొడిచాడట. తాజాగా ఆ విషయాన్ని యాంకర్ సుమ వెల్లడించి పెద్ద షాకిచ్చింది.

రాజమౌళి(Rajamouli) సినిమాలకు ఎంఎం కీరవాణినే(Keeravani) సంగీత దర్శకుడు. ఇప్పటి వరకు ఆయన్ని మార్చింది లేదు. వీరి ఎప్పటికీ కాంబినేషన్ ఫిక్స్. మొన్నటి `ఆర్ఆర్ఆర్`(RRR) చిత్రానికి కూడా ఎంఎం కీరవాణినే సంగీతం అందించారు. ఇందులో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. బీజీఎం హైలైట్గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లో ఎక్కడా కనిపించలేదు కీరవాణి. కేవలం రాజమౌళి, రామ్చరణ్, ఎన్టీఆర్లతో ఓ చిట్చాట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిశారు.
కానీ ఫస్ట్ టైమ్ కీరవాణి మరో చిన్న సినిమా కోసం ప్రమోషన్లో పాల్గొన్నారు. యాంకర్ సుమ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ నటించిన `జయమ్మ పంచాయితీ` (Jayamma Panchayathi)చిత్రం ఈ నెల6న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా తాజాగా ఆయన సుమ యాంకర్గా చేసే `క్యాష్`(Cash Show) షోకి వచ్చారు. దీంతో యాంకర్ సుమ ఆనందానికి అవదుల్లేవు. ఈ ఆనందంలోనే ఉబ్బితబ్బిబ్బవుతుంది. ఇదే విషయాన్ని `క్యాష్` షోలో తెలిపింది.
`ఆర్ఆర్ఆర్` సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారో లేదో తెలియదుగానీ మా `జయమ్మ పంచాయితీ`కి వచ్చినందుకు ధన్యవాదాలు సర్ అంటూ దెండం పెట్టిందిAnchor Suma. ఈ క్రమంలో కీరవాణి సెంటర్గా కామెడీని పండించింది. కీరవాణిపై పంచ్లు, ఇతరులపై కీరవాణి పంచ్లు, సింగర్ మనో యాక్షన్, `ఆచార్య`, `అఖండ`లో పాటలు పాడిన గీతా మాధురిని యాంకర్ సుమ ప్రశ్నలతో తికమక పెట్టిన విధానం నవ్వులు పూయించింది.
అనంతరం మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది యాంకర్ సుమ. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని రాజమౌళి, ఎన్టీఆర్, రామ్చరణ్ల ముందు గట్టిగా ఇరికించింది. ఎన్టీఆర్(NTR), రామ్చరణ్(Ram Charan) కలిసి నటించిన `ఆర్ఆర్ఆర్` చిత్ర ప్రమోషన్లో కీరవాణి పాల్గొనలేదని, కానీ తమ `జయమ్మ పంచాయితీ` సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నారని గర్వంగా చెప్పింది.
అంతటితో ఆగలేదు. ఈ సందర్భంగా మమ్మల్ని చూసి, మా సినిమాని చూసి కుళ్లుకోవాలని రాజమౌళి, ఎన్టీఆర్, రామ్చరణ్లను ఉద్దేశించి చెప్పింది సుమ. ఇది ఆద్యంతం నవ్వులు పంచింది. షోలో సందడి నెలకొంది. అయితే సుమ ఈ డైలాగ్ చెబుతున్నప్పుడు వెనకాల స్క్రీన్లో కీరవాణి వెన్నుపోటు పొడుస్తున్న పోస్టర్ని డిస్ ప్లే చేయడం దుమారం రేపుతుంది. ఇందులో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్చరణ్లను వెనకాల నుంచి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వెన్నుపోటు పొడుస్తున్నారు. `బాహుబలి` చిత్రంలో బాహుబలి ప్రభాస్ని కట్టప్ప సత్యరాజ్ వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా ఈ పోస్టర్ని డిజైన్ చేయడం విశేషం. సరదాగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.
మరి దీన్ని కామెడీగానే తీసుకుంటారా? లేక ఇందులో ఏదైనా తప్పులు వెతుకుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తేడా కొడితే కీరవాణి, యాంకర్ సుమ దారుణంగా బుక్కైపోయినట్టే అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ ప్రోమోలో చివరగా కీరవాణికి శాలువా కప్పి సన్మానించుకున్నారు. అనంతరం కీరవాణి కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంది యాంకర్ సుమ. తాజాగా విడుదలై `క్యాష్` ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది శనివారం ఫుల్ ఎపిసోడ్ ప్రారంభం కానుంది.