బాపు బొమ్మలా రాశీ.. తన ఊహలు నిజమైన వేళ (లేటెస్ట్ శారీ ఫోటోస్)
కొంటె అందాలతో ఆకట్టుకుంటున్న రాశీఖన్నా గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతుంది. ఇటీవల హాట్ ఫోటోలను పంచుకుని ఆకట్టుకున్న ఈ అమ్మడు తాజాగా చీరలో కనువిందు చేస్తుంది. తన అందాలను ఒలకబోస్తుంది.
రాశీఖన్నా బొద్దుగా ఉంటూ టాలీవుడ్ ఆడియెన్స్ ని అలరిస్తున్న రాశీఖన్నా ఎప్పటికప్పుడు ఫోటో షూట్లో అలరిస్తుంది. తన అభిమానులు మైమరపిస్తుంది.
తాను కన్న కలని ఫోటో రూపంలో చూసుకుని మురిసిపోతుంది. తన పెయింటింగ్ని కలలు కనిందట. ఆ కలలు ఇప్పుడు నిజమయ్యారు. ఓ ఫోటో గ్రాఫర్ రాశీని బాపు బొమ్మలా ఆవిష్కరించారు.
అచ్చం తాను ఊహించిన విధంగానే అద్బుతంగా ఫోటోలు తీసి తనకి గిఫ్ట్ ఇచ్చాడు. తాజాగా ఆయా ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
గ్రీన్ కలర్ శారీలో పోజులిచ్చింది. కొంటెగా చూస్తు ఆకట్టుకుంటుంది. తన అభిమానులను గిలిగింతలు పెడుతుంది.
ఈ సందర్భంగా రాశీ పేర్కొంటూ తనని తాను ఇలా చూస్తే ఏం చెప్పలేకపోతున్నానని, ఓ పాట పాడాలని ఉందని పేర్కొంది.
మూడ్ డల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ గెటప్ పంచుకుంది. అందులో మూతి ముడుచుకుని క్యూట్గా కనిపిస్తుంది రాశీ.
తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన ఫోటోగ్రాఫర్ శ్రావణ్ కుమార్కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పింది రాశీ.
ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండ `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలో మెరిసిన రాశీ..తమిళంలో `అరణ్మనై 3` చిత్రంలో నటిస్తుంది.