షూటింగ్ లో ప్రమాదం, హీరోయిన్ రాశీ ఖన్నా కు గాయాలు
స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నాకు ఏమయ్యింది. రాశీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. గాయాలతో ఉన్న ఆమెను చూసి ఫ్యాన్స్ ఆదోళణ చెందుతున్నారు. ఇంతకీ అసలు ఆమెకు ఏమయ్యాయింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలుగు, హిందీ, తమిళ్ చిత్ర పరిశ్రమల్లో తన నటనతో గుర్తింపు పొందిన హీరోయిన్ రాశీ ఖన్నా, ప్రస్తుతం వివిధ భాషలలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ముక్కు నుంచి రక్తం కారుతూ, కాళ్లకు, చేతులకు గాయాలు అయ్యి రక్తం కారుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ గాయాలు ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.ఫోటోలతో పాటు రాశీ ఖన్నా ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు: "కొన్ని రోల్స్ అడగవు, అవి డిమాండ్ చేస్తాయి. మీ శరీరం, మీ శ్వాస, మీ గాయాలు, మీరు తుఫానుగా మారినప్పుడు, ఉరుములకు కదలరు. త్వరలో రానుంది." ఈ సందేశం ద్వారా ఆమె తన పాత్రల కోసం చేసిన కష్టాలను, శ్రమను తెలియజేశారు.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమెకు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే రాశీ ఖన్నాకు నిజంగా దెబ్బలు తగిలాయా.. లేక షూటింగ్ లో బాగంగా అలా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా "తెలుసు కదా"లో సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి నటిస్తుంది రాశీ ఖాన్నా. . అలాగే, బాలీవుడ్లో "TME" అనే సినిమాలో విక్రాంత్ మస్సీతో కలిసి నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర "beautifully broken" అని తెలుస్తోంది.
ఇతర ప్రాజెక్టులలో కూడా ఆమె నటనకు మంచి స్పందన లభిస్తోంది. రాశీ ఖన్నా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూనే, షూటింగ్ సమయంలో ఎదురయ్యే కష్టాలను కూడా పంచుకుంటున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.