పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న రాశీఖన్నా.. బార్బీ డాల్ని మించిన అందంతో కుర్రాళ్లకి విజువల్ ట్రీట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీఖన్నా గ్లామర్ పోజులు నెటిజన్లకి విజువల్ ట్రీట్నిస్తుంటాయి. ఆమె పంచుకునే ఫోటోలు మతిపోగొట్టేలా ఉంటాయి. ఇప్పుడు శారీలో చూపు తిప్పుకోనివ్వడం లేదు రాశీ.
భారీ అందాలకు కేరాఫ్గా నిలిచే రాశీఖన్నా.. లేటెస్ట్ గా శారీలో పిచ్చెక్కిస్తుంది. పింక్ శారీలో స్లీవ్లెస్ బ్లౌజ్ ధరించి హోయలు పోయింది. కెమెరాలకు హాట్ పోజులిస్తూ దిగిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
గోపీచంద్తో కలిసి రాశీఖన్నా నటించిన `పక్కా కమర్షియల్` చిత్రం జులై 1న విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్లో రాశీఖన్నా హైలైట్గా నిలిచింది.
ఈ ఈవెంట్ కోసం రాశీ మరింత అందంగా ముస్తాబైంది. ఇందులో అందాల ప్రదర్శన, స్క్రీన్ షో లేకపోయినా, అంతకు మించి ఘాటు రేపుతుంది. పింక్ శారీలో మతిపోగొడుతుందీ సెక్సీ భామ. ప్రస్తుతం ఆమె పిక్స్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుండటం విశేషం.
ఈ సందర్భంగా రాశీఖన్నా మాట్లాడుతూ, చిరంజీవికి ధన్యవాదాలు తెలిపింది. ఇక్కడకు ఆయన రావడం ఆనందంగా ఉందని, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పింది. మరోవైపు గోపీచంద్లో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, ఆయన సినిమా కోసం చాలా కష్టపడారని తెలిపింది. ఈ చిత్రంతో ఆయనకు మంచి హిట్ వస్తుందని తెలిపింది.
ఈ ఛాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్, బన్నీ వాసులకు, అలాగే తనని బ్యాక్ టూ బ్యాక్ తీసుకుంటూ, తనని నమ్మి మంచి పాత్రలను ఇచ్చిన మారుతికి ధన్యవాదాలు చెప్పింది. ఇందులో తన పాత్ర మరో లెవల్లో ఉంటుందని మంచి పేరుతెస్తుందని, అదే సమయంలో అందరిని ఆకట్టుకుంటుందని చెప్పింది.
ఇందులో రాశీఖన్నా లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. సినిమాల్లో ఆర్టిస్ట్ క్యారెక్టర్ని చంపేశారని న్యాయంకోసం ఆమె కోర్ట్ ని ఆశ్రయించే సన్నివేశం ట్రైలర్లో ఆకట్టుకుంది. సినిమాలో ఆమె పాత్ర కామెడీగా సాగుతుందని తెలుస్తుంది.
ఇక రాశీఖన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. `పక్కా కమర్షియల్` చిత్రంతోపాటు నాగచైతన్యతో ఆమె `థ్యాంక్యూ` సినిమా చేస్తుంది. దిల్రాజు నిర్మించే ఈ చిత్రం జులై 22న విడుదల కానుంది. విక్రమ్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. మరోవైపు తమిళం, హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రాశీఖన్నా.