- Home
- Entertainment
- `జబర్దస్త్` కమేడియన్కి కిడ్నీ దానం చేస్తానన్న అభిమాని.. ఫస్ట్ టైమ్ బాధపడుతున్నా అంటూ కన్నీళ్లు
`జబర్దస్త్` కమేడియన్కి కిడ్నీ దానం చేస్తానన్న అభిమాని.. ఫస్ట్ టైమ్ బాధపడుతున్నా అంటూ కన్నీళ్లు
`జబర్దస్త్`లో పంచ్ ప్రసాద్ ఎంతగా ఫేమస్సో తెలిసిందే. ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తాజాగా ఆయనకు కిడ్నీ ఇచ్చేందుకు ఓ అభిమాని ముందుకు రావడం అందరిని కదిలిస్తుంది. దీనికి ప్రసాద్ రియాక్షన్ కన్నీళ్లు పెట్టిస్తుంది.

`జబర్దస్త్` షోలో నవ్వులు పంచే కమేడియన్ల జీవితాల వెనుక చాలా విషాద కథలున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది జబర్దస్త్ కమేడీయన్లు తమ బాధలను పంచుకున్నారు. తాము పంచే నవ్వుల వెనకాలున్న సాడ్ స్టోరీస్ని వెళ్లడించారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. అందులో `పంచ్` ప్రసాద్ ది మరో కథ. అత్యంత భావోద్వేగపూరితమైన కథ. దాన్ని మరోసారి వెల్లడించారు. కన్నీళ్లు పెట్టించారు.
పంచ్ ప్రసాద్గా `జబర్దస్త్`లో నవ్వులు పూయిస్తున్నారు ప్రసాద్. చిన్న స్థాయి నుంచి మంచి స్థాయికి ఎదిగారు. అయితే ఆయన అనారోగ్య(కిడ్నీ) సమస్య కారణంగా చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఆయన బతకడం కష్టమని డాక్టర్లే చెప్పారు. అలాంటి స్థితి నుంచి కోలుకుని ఇప్పుడు మళ్లీ `జబర్దస్త్`లో కమేడియన్గా రాణిస్తున్నారు. తన భార్య ఇచ్చిన సపోర్ట్ కారణంగా తాను బతికానని ఆ మధ్య షోలోనే చెప్పారు ప్రసాద్. భవిష్యత్లో తన భార్య తనకు ఓ కిడ్నీ దానం చేయబోతుందని వెల్లడించారు.
తాజాగా పంచ్ ప్రసాద్ కోసం కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చాడో అభిమాని. నిజంగానే మీకు కిడ్నీ అవసరం ఉందంటే, కిడ్నీ ఇస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారంటే నేను కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమే అని ఓ అభిమాని వీడియో ద్వారా వెల్లడించారు. ఇది సుడిగాలి సుధీర్ హోస్ట్ గా రన్ అవుతున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో జరుగుతుండటం విశేషం. సుధీర్ యాంకర్గా చేస్తున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోనూ పంచ్ ప్రసాద్ పాల్గొంటున్నారు. చాలా వరకు `జబర్దస్త్` నటులంతా ఈ షోలో పాల్గొని తమదైన స్పెషల్ స్కిట్లతో అలరిస్తుంటారు.
నెక్ట్స్ ఆదివారం ప్రసారమయ్యే `శ్రీదేవి డ్రామా కంపెనీ` ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో అభిమానులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి కమేడియన్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఓ అభిమాని వీడియో సందేశం పంపించారు. తాను కిడ్నీ దానం చేసేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు. `ప్రసాద్ అన్న మీకు నేను చాలా పెద్ద అభిమానిని. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ సమస్యని తలచుకుని ఎప్పుడైనా బాధపడ్డారా? మీకు నిజంగా అవసరం అయితే నా కిడ్నీ ఇవ్వడానికైనా నేను రెడీ అన్నా` అని తెలిపారు.
దీనికి పంచ్ ప్రసాద్ చెబుతూ, తనకు కిడ్నీ సమస్య ఉందని ఏ రోజూ తలచుకుని బాధపడలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దీని గురించి ఆలోచించలేదు. కానీ ఫస్ట్ టైమ్ ఇప్పుడు బాధపడుతున్నా. నా కోసం కిడ్నీ ఇచ్చేంత అభిమానులున్నారా? అనిపిస్తుంది. ఈ సందర్భంగా దేవుడిని కోరుకునేది ఏంటంటే.. నాకు ఇంకొన్నాళ్లు మిమ్మల్ని నవ్వించే లైఫ్ స్పాన్ ఇవ్వాలని కోరుకుంటున్నా` అని బరువెక్కిన హృదయంతో చెప్పారు ప్రసాద్. కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇది చూసి సుడిగాలి సుధీర్, ఇంద్రజ, హైపర్ ఆది, ఇతర టీవీ ఆర్టిస్టులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ లేటెస్ట్ ప్రోమోలో ఇది హైలైట్గా నిలిచింది. వచ్చే ఆదివారం ఈటీవీలో ఈ షో ప్రసారం కాబోతుంది.