బాత్రూమ్లో హాలీవుడ్ నటుడితో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఫోటో వైరల్..
గ్లోబల్ స్టార్గా రాణిస్తున్న ప్రియాంక చోప్రాకి సంబంధించి ఓ అరుదైన ఫోటో ఒక బయటకు వచ్చింది. ఇది ఓ హాలీవుడ్ స్టార్తో బాత్రూమ్లో ఉన్న ఫోటో కావడం విశేషం. ఇంతకి వీరిద్దరికి అక్కడేం పని, అక్కడ వీళ్లేం చేస్తున్నారనేది హాట్ టాపిక్గా మారింది.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ నటిగా రాణిస్తుంది. ఇండియన్ సినిమాలు చేయడమే మానేసింది. ఇప్పుడన్నీ హాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తుంది. నిక్ జోనాస్ని మ్యారేజ్ చేసుకున్నాక ఇండియా రావడమే మానేసింది ప్రియాంక. కానీ ఇండియాపై ప్రేమని మాత్రం వదులుకోవడం లేదు. కరోనా విజృంభన నేపథ్యంలో తన వంతు సాయం చేస్తుంది. కోవిడ్ సలహాలు, ట్రీట్మెంట్, హాస్పిటల్ ఇలా సమాచారం పంచుకుంటుంది. ఇండియా కోసం హాలీవుడ్ నటులు సహాయం చేసేందుకు ముందుకు రావడంలో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రియాంకకి సంబంధించి ఓ అరుదైన, అన్సీన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది 2017లో మెట్గాలా ఈవెంట్లో పాల్గొన్న ఫోటో. హాలీవుడ్ సెలబ్రిటీలు ఇందులో పాల్గొని సందడి చేస్తుంటారు.
ఇండియా నుంచి ప్రియాంక, దీపికా పదుకొనెలకు ఇందులో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ సమయంలో తన ప్రియుడు(ఆ సమయంలో ఇంకా మ్యారేజ్ కాలేదు) నిక్ జోనాస్తో కలిసి ఆ ఈవెంట్లో పాల్గొంది ప్రియాంక. మెట్గాలా న్యూయార్క్ లో జరిగే ఫ్యాషన్ ఈవెంట్. దేశ విదేశాల నుంచి ప్రముఖ టాప్ స్టార్స్ ఇందులో పాల్గొంటారు.
అయితే ఈ ఈవెంట్లో ప్రియాంక హాలీవుడ్ నటుడు, `బ్లాక్ పాంథర్` స్టార్ మైఖేల్తో మాట్లాడుతుంది. అది కూడా బాత్రూమ్లో. బాత్రూమ్లో వీళ్లకి ఏం పని అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిద్దరు మాత్రమే కాదు, ఇతర స్టార్స్ కూడా ముచ్చటిస్తున్నారు.
రెడ్ కార్సెట్పై తళుక్కున్న మెరిసేందుకు ముందు, ఆ తర్వాత ఇక్కడే రిలాక్స్ అవుతారని తెలుస్తుంది. తాజాగా ఈ ఫోటోని హాలీవుడ్ సింగర్ రీటా ఓరా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో అనేక సెటైర్లకి కేరాఫ్గా నిలుస్తుంది. మాట్లాడుకోవడానికి మరే ప్లేస్ లేదా? అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రియాంక 2018లో రెండోసారి 'మెట్ గాలా'కు హాజరవగా, 2019లో భర్త నిక్తో మరోసారి ఈవెంట్లో మెరిసింది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్లో `టెక్స్ట్ ఫర్ యూ`, `మ్యాట్రిక్స్` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు `సిటాడెల్` అనే టీవీ సిరీస్ చేస్తుంది. ఈ మధ్యే న్యూయార్క్లో సోనా అనే రెస్టారెంట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.