ఫొటోలు: ప్రియాంక చోప్రా..బికినీ వేసి బీచ్ లో..ఇప్పుడేంటి ఈ రచ్చ?
భారతీయ సినిమాను ప్రపంచస్థాయిలో పాపులర్ చేస్తున్న వారిలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గతంలో ఓసారి ఆస్కార్ అవార్డులకు అతిథిగా వెళ్లారామె. తాజాగా ఆస్కార్ను గెలవాటనికి వెళ్తున్నారని సమాచారం. ప్రియాంకా చోప్రా నటిస్తున్న తాజా చిత్రం ‘ది వైట్ టైగర్’. ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కోసం ఈ సినిమా చేస్తున్నారామె.వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ వేడుకలో ఈ చిత్రం తరఫున ఉత్తమ సహాయ నటి విభాగంలో ప్రియాంక చోటు దక్కించుకునే అవకాశం ఉందని టాక్. ఈ నేపధ్యంలో ఆమెకు సంబందించిన ఫొటోలు హాట్ కేకుల్లా మారాయి. ముఖ్యంగా ఆమె బికీని ఫొటోలు నెట్ లో మరోసారి వైరల్ అవుతున్నాయి. చూసిన ఫొటోలనే మళ్లీ చూస్తూ ఫ్యాన్స్ మురసిపోతున్నారు. మరి మీరూ ఓ లుక్కేయండి..
ఆస్కార్ లిస్ట్లో ఆల్రెడీ హాలీవుడ్ స్టార్స్ మెరిల్ స్ట్రీప్స్, క్రిస్టిన్ స్కాట్ థామస్, ఒలీవియా కోల్మన్ ఉండొచ్చని తెలిసింది. మరి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ను ప్రియాంక గెలుచుకుంటారా? వేచి చూడాలి.
ఇండో–ఆస్ట్రేలియన్ రచయిత అరవింద్ అడిగి రచించిన ‘ది వైట్ టైగర్స్’ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు. త్వరలోనే నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం విడుదలవుతుంది.
భర్త నిక్ జోనస్తో కలిసి అనేక దేశాలను తిరగేస్తున్న ఆమె ఆ ట్రిప్ను ఎంజాయ్ చేస్తోందని ఆమె వదిలే ఫొటోలను చూస్తే అర్దమవుతోంది.
హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. తన బికినీ అందాలతో అభిమానులకూ కనువిందు చేస్తోంది. సముద్రంలో స్నానం చేస్తూ హాట్ హాట్గా ఫోటోలకు పోజులిచ్చింది.
బీటౌన్లో ప్రియాంకా చోప్రా పేరు ప్రస్తావనకు వస్తే చాలు. ఆమె చేయనున్న సినిమా విషయాలు పక్కనపెట్టి ప్రేమ గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.
అంతలా అమెరికన్ సింగర్ నిక్ జోనస్తో కలిసి ప్రియాంక చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
ఆ మధ్యన న్యూయార్క్ వెకేషన్లో వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడమే వీరి ప్రేమకు నిదర్శనం అనొచ్చు.
లాక్డౌన్ సమయాన్ని భర్త నిక్ జోనస్తో కాలిఫోర్నియాలోనే గడిపారు ప్రియాంకా చోప్రా.
ఈ కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్కి సిద్ధమయ్యారామె. ‘మ్యాట్రిక్స్ 4’ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
ఇందులో ప్రియాంక కీలక పాత్ర చేస్తున్నారు. కీయాను రీవెస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ‘మ్యాట్రిక్స్’ ఫ్రాంచైజీలో నాలుగో భాగం.
ఆల్రెడీ లాక్డౌన్ ముందు నటీనటులందరూ యాక్షన్ సన్నివేశాల వర్క్షాప్లో పాల్గొని శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుత షెడ్యూల్ జర్మనీలో జరగనుందని సమాచారం.
నటిగా, బిజినెస్ ఉమెన్గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ప్రియాంక చొప్రా తన కెరీర్లో మరో మైలు రాయికి చేరుకున్నారు.
అమెజాన్ మల్టీ మిలియన్ డాలర్లు విలువ చేసే ఫస్ట్ లుక్ టెలివిజన్ డీల్పై ఆమె సంతకం చేసిన విషయం తెలిసిందే.
ప్రియాంక రెండేళ్లపాటు అమెజాన్తో కలిసి పనిచేయనున్నారు. అది తెలిసి ‘థప్పడ్’ దర్శకుడు అనుభవ్ సిన్హా గతంలో ప్రియాంక గురించి ఓ మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్ను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రియాంక అభిమానులు ఆమెపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తన గురించి తెలియని ఎన్నో విషయాలను తన ‘అన్ఫినిష్డ్ పుస్తకం’లో పంచుకోవాలని కోరారు.
ప్రియాంకా చోప్రా గత ఏడాది సందడి చేసిన వేడుకల్లో టొరొంటో చలన చిత్రోత్సవాలు ఒకటి. ఆమె నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
దాంతో ఈ వేడుకకు హాజరై, ఎర్ర తివాచీపై ‘క్యాట్ వాక్’ చేసి, కనువిందు చేశారు. ఈసారి ప్రియాంక ఈ చిత్రోత్సవాలకు ‘బ్రాండ్ అంబాసిడర్’.
ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలకు 50 మంది సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆహ్వానంగా అందుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి ప్రియాంకా చోప్రా, దర్శకుడు అనురాగ్ కశ్యప్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక కావడం విశేషం.
గతేడాది గ్లోబల్స్టార్ ప్రియాంక చోప్రా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 20 మిలియన్ డాలర్లు(రూ.144 కోట్ల) వెచ్చించి లాస్ ఏంజెల్స్లోని స్థానిక ఎన్సివో ప్రాంతంలోని ఈ విల్లాను తమ సొంతం చేసుకున్నారు.
కొన్ని ఏళ్లపాటు ప్రేమించుకుని 2018 డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటయిన బాలీవుడ్ నటి ప్రియాంక, హలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్.
లాక్డౌన్ కారణంగా మొన్నటిదాకా అడుగు బయిటపెట్టకుండా ఇంట్లోనే ఉంటున్నారు. రోజంతా వర్కవుట్లు, పెంపుడు కుక్కతో ఉల్లాసంగా గడిపారు.