ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ.. థ్యాంక్స్ చెప్పిన ఉపాసన, ఎవరెవరొచ్చారంటే..?
ఆస్కార్ రేసులో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ టీమ్ కు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది ప్రియాంక చోప్రా. అమెరికాలో సౌత్ స్టార్ యాక్టర్లతో సందడి వాతావరణం నెలకొంది. మరి ఈ పార్టీకి ఎవరెవరు వచ్చారంటే.. ?

ఆర్ఆర్ ఆర్ టీమ్ కు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది ప్రియాంక చోప్రా. ఈ పార్టీకి దక్షిణాసియా ఫిలిం ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులకు హాజరయ్యి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, ప్రీతి జింతా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు హాజరయ్యారు.
Image: Preity Zinta / Instagram
ఇక ఈ పార్టీలో తన పాత ఫ్రెడ్స్ ను కలుసుకుని తెగ సంబరపడింది. ప్రీతి జింతా. స్నేహితులందర్నీ మళ్ళీ ఒక చోట కలిసేవరకూ సంతోషం పట్టలేకపోయింది. అందిరితో సెల్ఫీ దిగి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో తెలియజేసింది.
బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన ప్రియాంక.. అక్కడ సినిమాల్లో నటిస్తూ.. హాలీవుడ్ స్టార్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జానస్ ను పెళ్ళాడింది. రీసెంట్ గా హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ లో కూడా నటించింది. ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్న ప్రియాంక.. తాజాగా ఆస్కార్ కోసం వచ్చిన వారికీ ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది.
ఈ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్ గా మారారు రామ్ చరణ్, ఎన్టీఆర్ . ఈ సందర్భంగా ప్రియాంక చోప్రాతో కలిసి రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఫొటో దిగారు. దీన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన ఉపాసన.. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. హాలీవుడ్ లో ఎప్పుడూ తమ కోసం సపోర్ట్ చేసిన ప్రియాంకకు ఉపాసన ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పారు.
ఇక రామ్ చరణ్, ప్రియాంక చోప్రా గతంలో జంజీర్ సినిమాలో నటించారు. తెలుగులో ఈ సినిమా తుఫాన్ గా రిలీజ్ అయ్యింది. దీంతో అప్పటి నుంచి మంచి స్నేహం ఉండడంతో.. చరణ్, ఉపాసనలతో కలిసి ప్రియాంక స్పెషల్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను ఉపాసన షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ లో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అమెరికాలో ఫుల్ బిజీతా ఉన్నారు. త్రిపుల్ ఆర్ సినిమా స్సెషల్ స్క్రీనింగ్స్ చేస్తూ.. హాడావిడిగా ఉన్నారు. మరి మన తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తుందా రాదే అనేది ఒక రోజులో తేలిపోబోతోంది.