`బికినీలో ప్రియమణి`.. ఒప్పించేందుకు ప్రొడ్యూసర్ ఏం చేశాడో తెలుసా?
ప్రియమణి ప్రస్తుతం టాప్ హీరోయిన్గా రాణిస్తుంది. ఒకప్పుడు గ్లామరస్ రోల్స్ కూడా చేసిన ఈ అమ్మడు ఓ సినిమాలో బికినీలో కనువిందు చేసింది. అయితే ప్రియమణి బికినీ వేసేందుకు ఆ నిర్మాత ఏం చేశాడో తెలుసా?
ప్రియమణి.. నితిన్ హీరోగా రూపొందిన `ద్రోణ` చిత్రంలో హీరోయిన్ గా నటించింది. జె.కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీ.ఎస్.రావు నిర్మాత. ఇప్పుడాయన నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
అప్పట్లో `ద్రోణ` సినిమాలో బికినీ వేసేందుకు నిర్మాత బలవంతం చేశాడని, అందుకు ఆమె డబ్బులు కూడా బాగానే తీసుకుందనే ప్రచారం జరిగింది. దీంతో అప్పుడిది హాట్ టాపిక్గా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి `ద్రోణ` సినిమాలో బికినీ వేయడానికి కారణమేంటనేది రివీల్ చేశారు నిర్మాత డి.ఎస్.రావు. ఓ యూట్యూబ్ ఛానెల్లో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రియమణి విషయం చర్చకు వచ్చింది. `మీరు ఆ సీన్ కోసం బాగానే ఇచ్చారటగా?` అని ప్రశ్నించగా, అందుకు డీఎస్.రావు స్పందిస్తూ..అందులో నిజం లేదన్నారు.
తాను ఆమెని ఎలాంటి బలవంతం చేయలేదన్నారు. ఆమె ఇష్టపూర్వకంగానే బికినీ వేసేందుకు ఒప్పుకుందని చెప్పారు. అది సినిమాకి బాగా హెల్ప్ అయ్యిందని పేర్కొన్నారు.
`మా దర్శకుడు చాలా కూల్గా ఉండేవాడు. ఓ రోజు ప్రియమణిని అడిగాడు. బికినీ వేయిద్దామనుకుంటున్నాం. మీరు ఒప్పుకుంటే. మీతో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది. అందులో మీరు ఒక్కరే ఉంటారని చెప్పాడు. ఆ అమ్మాయి కార్వ్యాన్లోకి వెళ్లా వాళ్లమ్మతో మాట్లాడి ఐదు నిమిషాల్లో బయటకు వచ్చి ఓకే నేను చేస్తానని చెప్పింది` అని అన్నారు.
`అయితే అప్పుడు ప్రియమణి.. డీఎస్ రావు వద్ద డబ్బులు గుజ్జిందని చాలా ప్రచారం జరిగింది. దీంతో నేను ప్రెస్ మీట్ పెట్టి క్లీయర్గా చెప్పాను. ఆమె అసలు డబ్బులు గురించే మాట్లాడలేదు. ఆమె ఇంట్రెస్ట్ గా చేస్తానని చెప్పింది చేయించాం. అందులో నా ఇన్వాల్వ్ మెంట్ ఏం లేద`ని చెప్పాడు.
`ఆ సాంగ్ షూటింగ్ సమయంలో ఫోటోలు తీసుకుని ఎవ్వరికీ ఇవ్వలేదు. కానీ ఎవరికి ఇవ్వాలో వారికే ఇచ్చా. కనీసం ఆ అమ్మాయికి కూడా ఇవ్వలేదు. వాటిని బయటకు రాకుండా చూసుకున్నాను. కేవలం సినిమా పోస్టర్లోనే ఓ ఫోటో వేయించాం. కొంత వరకు బయటపడ్డా. పెద్ద హీరోకి వచ్చినట్టుగా `ద్రోణ` సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయి` అని తెలిపారు.
ప్రియమణి `ద్రోణ` సినిమాలోనే బికినీ వేసింది. అందులోనూ సోలోగా డాన్స్ చేస్తూ షేక్ చేసింది. ఆ తర్వాత మరే సినిమాలో ఆ రేంజ్లో అందాలు ఆరబోయలేదు. ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది.
తెలుగులో ఆమె ప్రస్తుతం `విరాటపర్వం`, వెంకటేష్తో `నారప్ప` చిత్రాల్లో నటిస్తుంది. తమిళం, కన్నడ, మలయాళంలో అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదే కాకుండా `ఢీ` షోలో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఈ షో కోసం ఈ అమ్మడు పంచుకునే గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పిల్లు మణి క్రేజ్ మరింతగా పెంచుతున్నారు.