ప్రియమణి, విద్యా బాలన్ వీరిద్దరు కజిన్స్ .. కానీ మాట్లాడుకుంది ఒకేసారి.. ఎందుకో తెలుసా?
హీరోయిన్ ప్రియమణి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్తో ఉన్న రిలేషన్ ని కూడా రివీల్ చేసింది. కానీ ఛాన్స్ ల కోసం ఎవరినీ వాడుకోలేదని తెలిపింది.
ప్రియమణి ఇటీవల ఓ వైపు టీవీ షోస్, మరోవైపు సినిమా, ఇంకో వైపు వెబ్ సిరీస్లు ఇలా మూడు రకాలుగా బిజీగా ఉంది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ తో దూసుకుపోతుంది. పెళ్లైన తర్వాతనే మరింతగా ఉత్సాహంగా వర్క్ చేస్తుంది. మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ని రన్ చేస్తుంది.
ఇదిలా ఉంటే ఆమె నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతుంది. హిందీలోనూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించింది ప్రియమణి.
విద్యాబాలన్తో తమకున్న అనుబంధాన్ని వెల్లడించింది. తమది సినిమా బ్యాక్గ్రౌండ్ అని చెప్పింది. తమ ఫ్యామిలీలో చాలా మంది సంగీతంతో టచ్ ఉందని, సింగర్ మల్లాది శుభ గారు తమకి చిన్న మేనమామగారి భార్య అని, వాళ్లమ్మ తరపున అందరు సంగీతంతో ముడిపి ఉన్నారని చెప్పింది.
విద్యాబాలన్ తనకి కజిన్ అవుతుందని చెప్పింది. వాళ్లనాన్న, విద్యాబాలన్ వాళ్ల నాన్న కజిన్స్ అవుతారట. కానీ ఎప్పుడూ డైరెక్ట్ గా కలవలేదని చెప్పింది. ఎప్పుడో ఓ అవార్డు ఫంక్షన్లో కలిసి మాట్లాడుకున్నట్టు తెలిపింది ప్రియమణి. దూరపు బంధువులు కావడంతో పెద్దగా టచ్ లో లేమని తెలిపింది.
తమ ఫ్యామిలీకి సినిమా రంగంతో సంబంధాలున్నప్పటికీ తాను మాత్రం అవకాశాల విషయంలో ఎవరినీ వాడుకోలేని, తాను స్వయంగానే వచ్చానని, సొంతంగానే పైకి వచ్చినట్టు వెల్లడించింది. కాకపోతే విద్యాబాలన్ నటన బాగుంటుందని, ఆమె ఎంచుకునే పాత్రలు డిఫరెంట్గా ఉంటాయని చెప్పింది. బాలీవుడ్లో ఖాన్స్, కపూర్ ఫ్యామిలీల మధ్య తనో స్టార్గా ఎదగడం గొప్ప విషయమని తెలిపింది.
సోషల్ మీడియాపై స్పందిస్తూ, సామాజిక మాధ్యమాల్లో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తుంటారు. బాడీషేమింగ్ పైన ఎవరు మాట్లాడినా కోపం వస్తుంది. సోషల్ మీడియాలో కొందరు నన్ను ఆంటీ అని, మీరు బాగా ఓల్డ్ అయ్యారనీ కామెంట్లు పెడుతుంటారు. మహిళలను గౌరవించడం తెలియదు` అని మండిపడింది ప్రియమణి.
తనకు నచ్చినట్టు జీవించడం ఇష్టమని, ప్రతి ఉదయాన్నీ సంతృప్తిగా ఆస్వాదిస్తానని వెల్లడించింది. దక్షిణ భారతీయ ఫిల్టర్ కాఫీతో తన ఉదయం ప్రారంభమవుతుందని చెప్పింది. `ఒకప్పుడు మా అమ్మ భారత్ తరఫున బ్యాడ్మింటన్ ఆడింది. అందుకే నాకు కూడా ఆ క్రీడతో అనుబంధం ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో ఆడాను. నెట్ఫ్లిక్స్తో కూడా కాలక్షేపం చేస్తుంటా` అని చెప్పొకొచ్చింది.
ప్రస్తుతం ప్రియమణి `ఢీ` షోకి జడ్జ్ గా చేయడంతోపాటు వెంకటేష్తో `నారప్ప` చిత్రంలో నటిస్తుంది. `విరాటపర్వం`లో నక్సలైట్గా నటిస్తుంది. అలాగే హిందీలో `మైదాన్`లో, అలాగే `సైనైడ్`, `కొటేషన్ గ్యాంగ్` చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.