పవన్ ఓటమి.. మెగా ఫ్యామిలిలో వాతావరణం ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశ్లేషకులు చెప్పినదానికంటే ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఎట్టకేలకు వైసిపి ఘనవిజయాన్ని అందుకొని రాజకీయ భవిష్యత్తుకు వన్ వే రూట్ సెట్ చేసుకుంటోంది. అన్నిటిని పక్కనపెడితే జనసేనకు ఎదురైనా చేదు అనుభవం మాత్రం ఎవరు ఊహించనిది.
విమర్శకులు ఒక్క సీటు కూడా రాదని ఎంత చెప్పినప్పటికీ ఎన్నో కొన్ని వస్తాయని ఓ వర్గం వారు గట్టిగా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ ఓటమి అభిమానులను సైతం షాక్ కి గురి చేసింది.
ఫ్యాన్స్ ఎవ్వరికి పవన్ ఓటమి మింగుడుపడటం లేదు. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే మెగా ఫ్యామిలీలో ఎలాంటి వాతావరణం చోటు చేసుకుందనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న సందేహం.
అన్నయ్య చిరంజీవితో గొడవపడి మరి పార్టీ పెట్టిన పవన్ కి ఇలాంటి ఫలితాలు రావడం నిజంగా ఆశ్చర్యమే. చిరంజీవి ఇప్పుడు తమ్ముడితో ఏ విధంగా చర్చ జరిపాడు అనేది మరో సందేహం.
అయితే ఎన్నికల రిజల్ట్ అనంతరం మెగా యువ హీరోలు ప్రత్యేకంగా పవన్ ని కలుసుకున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ బ్రదర్స్ తల్లితో కలిసి ముందే పవన్ ని కలిశారని సమాచారం.
ఇక రామ్ చరణ్ బాబాయ్ ని స్పెషల్ గా కలుసుకోబోతున్నట్లు తెలుస్తోంది. చెర్రీ ఫెస్ బుక్ లో చేసిన పోస్ట్ మాత్రం మెగా ఫ్యాన్స్ కి కొంత రిలీజ్ ని ఇచ్చింది.
బన్నీ ఎన్నికల చివరి నిమిషంలో పవన్ తో అడుగైతే వేశాడు. ఇప్పుడు కలిశాడా లేదా అనేది తెలియదు. అల్లు ఫ్యామిలీతో పవన్ కాస్త దూరంగానే ఉన్నా ఇలాంటి సమయంలో వారు ఏ విధంగా నడుచుకుంటారనేది చూడాలి.
మొత్తానికి పవన్ అయితే మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతానని క్లారిటీగా చెప్పేశాడు. అయితే ఆయన రాజకీయాల్లో ఉండడం కంటే సినిమాల్లోకి రావడం బెటర్ అని మరికొన్ని రోజుల్లో సినిమాలు కూడా మొదలెడతారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
మరి పవన్ విమర్శకులకు కౌంటర్ ఇచ్చే విధంగా రాజకీయాల్లో కొనసాగుతారా లేక అన్నయ్యలా మళ్ళీ వెనుకడుగు వేస్తారా? అనేది వేచి చూడాలి.