Disha Patani: కొత్త ప్రియుడితో చక్కర్లు కొడుతున్న ప్రభాస్ హీరోయిన్... మరోసారి అడ్డంగా బుక్కైన దిశా పటాని!
హీరో టైగర్ ష్రాఫ్ కి బ్రేకప్ చెప్పిన దిశా పటాని కొత్త ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. తాజాగా అలెక్సాండర్ తో డిన్నర్ డేట్ కి వెళుతూ దిశా కెమెరా కంటికి చిక్కారు.
Disha Patani
బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటాని కొత్త బాయ్ ఫ్రెండ్ తో జతకట్టారనేది మీడియావర్గాల వాదన. మోడల్, నటుడు అలెక్సాండర్ ఇలిక్ తో ఆమె ఎఫైర్ నడుపుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు.తరచుగా దిశా అతనితో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారు. దీంతో దిశా పటాని-అలెక్సాండర్ మధ్య ఘాడమైన ప్రేమబంధం ఏర్పడిందని బల్ల గుద్ది చెబుతున్నారు.
దిశా పటాని చాలా కాలం హీరో టైగర్ ష్రాఫ్ తో ఎఫైర్ నడిపారు. అధికారికంగా తమ రిలేషన్ ప్రకటించకున్నప్పటికీ... విందులు, విహారాలు కలిసి చేస్తూ వార్తలకు ఎక్కారు. టైగర్ ష్రాఫ్ మాదిరి దిశా కూడా ఫిట్నెస్ ఫ్రీక్. జీరో సైజు మైంటైన్ చేస్తున్న దిశా పటాని ఫైటింగ్ స్కిల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.
Disha Patani
అయితే దిశా-టైగర్ ష్రాఫ్ విడిపోయారని ఏడాది కాలంగా వినిపిస్తుంది. దిశా పటాని మోడల్ అలెక్సాండర్ తో తిరుగుతుండగా ఈ టైగర్ ష్రాఫ్ తో బ్రేకప్ రూమర్స్ కి బలం చేకూరింది. తాజాగా దిశా పటాని రూమార్డ్ బాయ్ ఫ్రెండ్ అలెక్సాండర్ తో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లారు.
Disha Patani
బేబీ పింక్ షార్ట్ ఫ్రాక్, సెక్సీ టాప్ ధరించిన దిశా పటాని, అలెక్సాండర్ తో కలిసి ముంబై బాంద్రా ఏరియాలో గల హోటల్ కి డిన్నర్ కి వెళ్లారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఈ జంటను తమ కెమెరాల్లో బంధించారు. వరుస సంఘటనల నేపథ్యంలో దిశా పటాని-అలెక్సాండర్ మధ్య ఎఫైర్ నిజమే అని జనాలు నిర్ధారిస్తున్నారు.
కాగా మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశ(Disha Patani) టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో ఆమెను హీరోయిన్ చేశారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ అనుకున్నంత విజయం సాధించలేదు.
ఇక తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకున్నా బాలీవుడ్ లో నిలదొక్కున్నారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం దిశ చేతిలో రెండు హిందీ చిత్రాలు ఉన్నాయి. ఆమె లేటెస్ట్ రిలీజ్ ఏక్ విలన్ రిటర్న్స్. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోలుగా నటించారు. ఈ మూవీలో తారా సుతారియా మరో హీరోయిన్. అయితే ఈ మూవీ ఆశించినంతగా విజయం సాధించలేదు.
అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు. 2023 జులై 23న యోధ విడుదల కానుంది. కాగా ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె(Project K) లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నారు. ఇండియా వైడ్ ప్రాజెక్ట్ కే పై అంచనాలున్నాయి.