400 కోట్లతో ప్రభాస్ నెక్ట్స్.. మూడో ప్రపంచ యుద్ధమే!
ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాతో మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది.
బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ మారిపోయింది. బాహుబలి రెండు భాగాలు జాతీయ స్థాయిలో ఘనవిజయం సాధించటంతో పాటు 1500 కోట్లకు పైగా వసూళ్లు సాదించటంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తదుపరి చిత్రాలను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.
సాహో తరువాత ఓ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్లో నటిస్తున్నాడు ప్రభాస్. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇటలీ బ్యాక్ డ్రాప్లో పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయ్యింది. అయితే మిగతా భాగంగా విదేశాల్లో కాకుండా ఇక్కడే సెట్ వేసి చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
ఇది ఉండగా తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు ప్రభాస్. ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాతో మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు యుద్ధభూమి సెట్ను హైదరాబాద్లో భారీ ఖర్చుతో వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
గతంలో ఈ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి తరహా కథాశంతో తెరకెక్కుతుందన్న టాక్ కూడా వినిపించింది. ఓ దేవకన్య భూలోకి రావటం అనే కాన్సెప్ట్తోనే ఈ సినిమా రూపొందుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ స్పంధించకపోయినా సినిమా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవల్ అంటూ హైప్ మరింతగా పెంచాడు.