- Home
- Entertainment
- Tollywood Director: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత.. శివాజీ, రమ్యకృష్ణల సినిమాతో పాపులర్
Tollywood Director: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత.. శివాజీ, రమ్యకృష్ణల సినిమాతో పాపులర్
Tollywood Director: టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రైటర్, దర్శకుడు బండి రఘురామ్ కన్నుమూశారు. ఆయన హార్ట్ ఎటాక్తో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

దర్శకుడు రఘురామ్ కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు రఘురామ్ కన్నుమూశారు. `వరం` చిత్రంతో పాపులర్ అయిన బండి రఘురామ్ మంగళవారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని, దీంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రఘురామ్ దర్శకుడు మాత్రమే కాదు, రైటర్, జర్నలిస్ట్ కూడా. ఆయన ఈటీవీ, వీ6, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి మీడియా సంస్థల్లో స్పెషల్ కరస్పాండెంట్గా వర్క్ చేశారు.
బండి రఘు రామ్ హైలీ ఎడ్యూకేటెడ్. ఆయన జర్నలిజంలో ఎంఫిల్ చేశారు. అలాగే ఇంగ్లీష్ లిటరేచర్లో పీహెచ్ డీ పూర్తి చేశారు. లిబ్యాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫేసర్గా పనిచేశారు. సినిమాలపై ఆసక్తితో అవన్నీ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చారు. ప్రారంభంలో ప్రముఖ దర్శకుడు సానాయాదిరెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆయన రూపొందించిన అన్ని సినిమాలకు రఘురామ్ పనిచేశారు. దర్శకత్వంలో మంచి అనుభవాన్ని పొందారు.
`వరం` సినిమాకి దర్శకత్వం
2004లో ఆయన దర్శకుడిగా మారి `వరం` అనే చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శివాజీ, రమ్యకృష్ణ వంటి వారు నటించారు. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ దర్శకుడిగా నిరూపించుకునేందుకు స్ట్రగుల్ అవుతున్నారు. చాలా సినిమాలకు రైటర్గా, గోస్ట్ రైటర్గా పనిచేశారు. ఇప్పటికీ దర్శకత్వ ప్రయత్నాల్లోనే ఉన్నారు. కానీ ఇంతలోనే ఇలా కావడం అత్యంత బాధాకరం.
రఘురామ్ కి జర్నలిస్ట్ గా తెలుగు మీడియాలో మంచి పేరుంది. ఆయన ఇచ్చే సినిమా రివ్యూలకు మంచి ఫాలోయింగ్ ఉంది. రఘురామ్ స్వస్థలం జగిత్యాల. ప్రస్తుతం హైదరాబాద్లో యూసఫ్ గూడలోని మధురానగర్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రఘు రామ్ మరణంతో చిత్ర పరిశ్రమలోనే కాదు. మీడియాలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

