ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదం పొలిటికల్ టర్న్.. వారంతా ఫేక్ ఫ్యాన్స్ అంటున్న పూనమ్!
ఒకప్పటి నటి మీరా చోప్రాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో కొందరు టార్గెట్ చేయటంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ స్క్రీన్ షాట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేయటమే కాదు. వారిపై చట్టపరమైన చర్యలకు కూడా దిగింది. తాజాగా ఈ వివాదం పూనమ్ కౌర్ ఎంట్రీతో మరో మలుపు తిరిగింది.
ఇటీవల సోషల్ మీడియాలో లైవ్లో మాట్లాడిన మీరా చోప్రా ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు అనటంతో ఈ వివాదం తెలియదు. దీంతో ఒక్కసారిగా జూనియర్ అభిమానులు మీరా చోప్రాను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర భాషలో సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయటం మొదలు పెట్టారు.
అయితే ఈ పోస్ట్లపై మీరా కూడా గట్టిగానే స్పదించింది. ఆ కామెంట్స్కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసి స్టార్ హీరోల అభిమానులు ఇలా చేయటం సరికాదంటూ చెప్పింది. అయినా కామెంట్స్ ఆగకపోవటంతో చట్ట పరమైన చర్యలకు దిగింది.
తన మీద ఎన్టీఆర్ అభిమానులు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది మీరా. వెంటనే స్పందించిన కేటీఆర్ ఆకతాయిల మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ డీజీపీకి, హైదరాబాద్ పోలీస్లకు సూచించారు.
అయితే తాజాగా ఈ వివాదంలోకి మరో హాట్ బ్యూటీ పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చింది. `ఏ హీరో కూడా తన అభిమానులు ఇతరులను ఇబ్బంది పెట్టాలని కోరుకోడు. అది ఇండస్ట్రీ, మీడియాలలో ఉన్న జెలసీ కారణంగా జరుగుతోంది. హీరోలకు ఇలాంటి పనులు చేసేంత సమయం ఉండదు. ట్రోలింగ్ అనేది తారల జీవితంలో భాగమైపోయింది. తప్పకుండా చర్చలు తీసుకోవాలి` అంటూ కామెంట్ చేసింది పూనమ్.
అంతేకాదు ఈ వివాదంలో పొలిటికల్ అంశం కూడా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది పూనమ్. ఈ ఫ్యాన్స్ అకౌంట్స్ రాజకీయ కారణాలతో కొంత మంది క్రియేట్ చేసి ఉంటారన్న అనుమానం వెళ్లిబుచ్చింది. అది ఎవరు చూసిన చివరకు నటులే బ్లేమ్ అవుతున్నారని చెప్పింది. మన సినీ రంగం రాజకీయ పార్టీలతో కలిసిపోయి ఉంది. అభిమానులు అమాయకులు. కొంత మంది రాజకీయ నాయకులే దుర్మార్గులు. వాళ్లే ఇలాంటివి చేస్తారు అని కామెంట్ చేసింది.
ఈ రోజు వరకు నా పేరును అనవసరంగా ఓ వివాదంలోకి లాగుతున్నారు. కానీ నేను ఒక్క అభిమాని మీద కూడా కంప్లయింట్ ఇవ్వలేదు. నాకు గట్టి నమ్మకం.. వారు అమాయకులైన అయి ఉంటారు, లేదా మధ్యలో ఉన్న వారు వారిని అలా ప్రేరేపించి ఉంటారు. అందుకే నేను నన్ను ఇబ్బంది పెట్టిన వారి మీదే కంప్లయింట్ ఇచ్చాను. ఫ్యాన్స్ను బ్లేమ్ చేయలేదు.
ఇప్పటి వరకు కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరా చోప్రాల మధ్య మాత్రమే వివాదంగా ఉన్న అంశాన్ని తాజాగా పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ అంశంగా మార్చేసింది. మరి ముందు ముందు ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.