Poonam Kaur: పూనమ్ కౌర్ కి మ్యారేజ్ అయిందా.. ఆ ఫోటో వైరల్, భరించలేనంత నష్టం అంటూ క్లారిటీ
సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది..
సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది.. కానీ పరోక్షంగా మాత్రమే. అప్పట్లో పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి.
తన కామెంట్స్ తో పూనమ్ కౌర్ రూమర్స్ కి కేంద్ర బిందువుగా మారింది. చాలా విషయాల్లో ఆమె క్లారిటీ మైంటైన్ చేయకుండా అందరిని తికమక పెట్టేది. దీనితో పూనమ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అభిమానుల్లో చర్చ జరిగేది. ఆమె ఆమె గురించి న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది.
ఇటీవల పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ కూడా అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూనమ్ కౌర్ ఇద్దరు చిన్నపిల్లలతో క్యూట్ గా దిగిన ఫోటో షేర్ చేసి హ్యాపీనెస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనితో పుకార్లకు రెక్కలు వచ్చాయి. పూనమ్ కౌర్ కి పెళ్లి అయిపోయిందని.. పిల్లలు కూడా ఉన్నారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి.
ఈ విషయాన్ని పూనమ్ కౌరే అంగీకరించినట్లు అయింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. గతంలో వైసిపి ఎమ్యెల్యే రోజా పవన్ పై రాజకీయ విమర్శలు చేస్తూ.. గతంలో పవన్ కళ్యాణ్ కి టిడిపి వాళ్ళు గుండు కొట్టించింది నిజం.. మళ్ళీ 2014 లో కొట్టించారు.. 2019లో కూడా కొట్టిస్తారు అని ఎన్నికలని ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు చేసింది.
దీనిపై పూనమ్ కౌర్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. 'నాకు భరించలేనంత నష్టం జరిగింది. ఇక ఆపండి. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకి థాంక్స్.. ఈ విధంగా క్లారిటీ ఇవ్వగలుగుతున్నా' అంటూ పూనమ్ ట్వీట్ చేసింది.
దీనితో కొందరు నెటిజన్లు పూనమ్ కౌర్ కి సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. క్లారిటీ ఈ ఒక్క విషయంలోనే కాదు.. మీరు చేస్తున్న అన్ని ఆరోపణలకు ఇవ్వాలని అంటున్నారు.
పూనమ్ కౌర్ కేవలం సినిమాల గురించి మాత్రమే కాదు.. పాలిటిక్స్ పై కూడా ఇన్ డైరెక్ట్ ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. మొత్తంగా పూనమ్ కౌర్ కి సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. పూనమ్ కౌర్ సినిమాల పరంగా యాక్టివ్ గా లేదు.