సౌతిండియా మొత్తం నడుము చుట్టే తిరుగుతుంది.. పూజా సంచలన వ్యాఖ్యలు..
స్టార్ హీరోయిన్ పూజా హెగ్గే సౌత్ చిత్ర పరిశ్రమపై షాకింగ్ కామెంట్ చేసింది. వాళ్ళంత నడుము చుట్టే తిరుగుతారని సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారం రేపింది.
తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు సినిమాలతోనే అగ్ర నటిగా ఎదిగింది. కానీ ఇప్పుడు సౌత్పైనే ఇలాంటి కామెంట్ చేయడం ఆమె అభిమానులను, నెటిజన్లని షాక్కి గురి చేస్తుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ, దక్షిణాది చిత్ర పరిశ్రమ వాళ్లు నడుము మత్తులోనే ఉంటారు. మిడ్ డ్రెస్లలో తమని చూడాలని కోరుకుంటారని వెల్లడించింది. దీంతో ఇది పెద్ద దుమారం రేపుతుంది.
ఆమె నవ్వుతూ చేసినా, దాని అర్థం నెగటివ్గా ఉండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్లో వేసుకుంటున్నారు. సౌత్ ఇండియా సినిమాల వల్లే హీరోయిన్గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజా ఇలాంటి కామెంట్లు చేయడం దారుణమని విమర్శలు గుప్పిస్తున్నారు.
కూర్చొన కొమ్మనే నరుక్కోవడమంటే ఇదే అని, అన్నం పెట్టిన చేతికి సున్నం పెడుతోందని మండిపడుతున్నారు. ఇక్కడ అలాంటి పాత్రలు చేసే బదులు అవి చేయ దక్షిణాదిని కించపరిచే బదులు గ్లామర్ పాత్రలు చేయకుండా ఉండాల్సిందని హితవు పలుకుతున్నారు.
హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న `మొహెంజోదారో` పరాజయం చెందడంతో తిరిగి తెలుగులోనే నటించి విజయాలు అందుకుంది. ఇటీవల `హౌజ్ఫుల్4` లో నటించి విజయాన్ని అందుకుంది.
ఈ సంక్రాంతి తెలుగులో `అల వైకుంఠపురములో`తో బ్లాక్ బస్టర్ అందుకున్న పూజా ప్రసుత్తం `రాధే శ్యామ్`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`, హిందీలో `సర్కస్` చిత్రాల్లో నటిస్తుంది.
ఇలా వరుసగా భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు సౌత్పై ఇలాంటి కామెంట్ చేయడం కొత్త వివాదానికి తెరలేపినట్టయ్యింది. అంతేకాదు అది ఆమె కెరీరే నష్టమని క్రిటిక్స్ అంటున్నారు.