- Home
- Entertainment
- PoojaHegde:పబ్లిక్ లో పొట్టి బట్టల్లో తిరిగేస్తున్న బుట్ట బొమ్మ.. ఎయిర్ పోర్ట్ లో అలా చూసి షాక్ అవుతున్న జనాలు
PoojaHegde:పబ్లిక్ లో పొట్టి బట్టల్లో తిరిగేస్తున్న బుట్ట బొమ్మ.. ఎయిర్ పోర్ట్ లో అలా చూసి షాక్ అవుతున్న జనాలు
బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja hegde) ఎయిర్పోర్ట్ లుక్ వైరల్ గా మారింది. వైట్ ఎల్లో కాంబినేషన్ ట్రెండీ వేర్ లో సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చారు. పొట్టి లాగులో పూజా సొగసరి కాళ్ళు కళ్లు తిప్పుకోకుండా చేస్తున్నాయి. పబ్లిక్ లో అమ్మడు గ్లామర్ షో చూసి జనాలు షాక్ అవుతున్నారు.

సెలెబ్రిటీలు కెమెరా కళ్ళు వెతుకుతూ ఉంటాయి. అడుగు బయట పెడితే చాలు ఫోటోగ్రాఫర్స్ క్లిక్ మనిపించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ విషయం బాగా తెలిసిన తారలు అందుకు తగ్గట్లుగా ట్రెండీగా రెడీ అవుతారు. హీరోయిన్స్ ఎయిర్ పోర్ట్ లుక్స్ ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. తాజాగా పూజా హెగ్డే కురచ బట్టల్లో తన అందాల పవర్ పరిచయం చేసింది.
ఇక పూజా కెరీర్ జోరు మీదుంది.ప్రభాస్(Prabhas) పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు రాధాకృష్ణ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రాధే శ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల ఉండగా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది.
కోలీవుడ్ టాప్ స్టార్ లేటెస్ట్ మూవీ బీస్ట్. డాక్టర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ (Beast) మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ గా తెరకెక్కుతుంది ఆచార్య(Acharya). విడుదలకు సిద్దమైన ఈ మూవీ ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆచార్య మూవీలో పూజా హెగ్డే చరణ్ కి జంటగా నటిస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ఫోన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ మాస్ చిత్రాలు దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం సర్కస్. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే జతకడుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సర్కస్ చిత్రం జులై లో విడుదల కానుంది.
సల్మాన్ ఖాన్ (Salman Khan)హీరోగా తెరకెక్కుతుంది భాయ్ జాన్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భాయ్ జాన్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికయ్యారు.
కాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయారు పూజా హెగ్డే. ఆయన గత రెండు చిత్రాలు అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాలలో పూజా హీరోయిన్ నటించారు. పూజాకు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ మహేష్ తో ప్రకటించారు. ఈ మూవీలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పూజా హెగ్డే హిట్ పర్సెంటేజ్ రీత్యా... అమ్మడు భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా రూ. 3.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. సౌత్ లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా పూజా రికార్డులకు ఎక్కినట్లు సమాచారం.