11 నెలలుగా సుశాంత్ డబ్బుతో గర్ల్ ఫ్రెండ్ ఖర్చులు.. ఆరా తీస్తున్న పోలీసులు
గత 11 నెలలుగా రియా భారీ మొత్తాన్ని సుశాంత్ ఎకౌంట్ నుంచి ఖర్చు చేసిన్టుటగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ముంబై పోలీసులు రియా ఎంత మొత్తం ఏ ఏ అవసరాలకు గాను వినియోగించిందో లెక్క తేల్చే పనిలో ఉన్నారు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని మాఫియా కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో ఆ దిశగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ సన్నిహితులతో పాటు, బాలీవుడ్ ప్రముఖులను విచారించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని దాదాపు 10 గంటల పాటు విచారించారు పోలీసులు.
అదే సమయంలో సుశాంత్ ఆత్మహత్య వెనుక ఆర్ధిక సమస్యలు కూడా కారణం అయి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. దీంతో సుశాంత్ బ్యాంక్ అకౌంట్లు ఆర్ధిక లావాదేవిలా గురించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.
అయితే ఈ విచారణలో సంచలన విషయాలు వెల్లడైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా రియా చక్రవర్తి ఖర్చులకు సుశాంత్ ఎకౌంట్ నుంచే డబ్బులు కట్ అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 2019లో రియా యూరప్లో ఓ యాడ్ షూటింగ్కు వెళ్లింది. ఆ ట్రిప్కు ఫ్లైట్ టికెట్లతో పాటు ఇతర ఖర్చులు సుశాంత్ అకౌంట్ నుంచే పే చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
అంతేకాదు గత 11 నెలలుగా రియా భారీ మొత్తాన్ని సుశాంత్ ఎకౌంట్ నుంచి ఖర్చు చేసిన్టుటగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ముంబై పోలీసులు రియా ఎంత మొత్తం ఏ ఏ అవసరాలకు గాను వినియోగించిందో లెక్క తేల్చే పనిలో ఉన్నారు.
సుశాంత్ మృతిపై ఇటీవలే స్పందించింది రియా చక్రవర్తి. తాను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేసుకుంటూ కేంద్ర మంత్రి అమిత్ షాకు సోషల్ మీడియా ద్వారా ఓ రిక్వెస్ట్ పెట్టింది. సుశాంత్ మృతిపై సీబీఐ ఎంక్వైరీ జరపించాలని కోరింది రియా.
యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన నివాసంలో గత నెల 14న ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు ఇలా ఆత్మహత్యకు పాల్పడటంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.