Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • తిరుమలలో గుండు చేయించుకున్న పవన్ కళ్యాణ్ భార్య, కొడుకు కోసం మొక్కు తీర్చుకున్న అన్నా లెజినోవా

తిరుమలలో గుండు చేయించుకున్న పవన్ కళ్యాణ్ భార్య, కొడుకు కోసం మొక్కు తీర్చుకున్న అన్నా లెజినోవా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య  అన్నాలెజినోవా శ్రీవారి దర్శనం కోసం  తిరుమల తిరుపతి చేరుకున్నారు. అంతకు ముందు ఆమె గుండుచేయించుకుని, శ్రీవారికి తలనీలాల మొక్కులు కూడా చెల్లించుకున్నారు. సింగపూర్ లో అగ్నిప్రమాదం నుంచి తన తనయుడు మార్క్ శంకర్ బయటపడటంతో  ఆమె తన మొక్కులు చెల్లించుకున్నారు. 

Mahesh Jujjuri | Updated : Apr 14 2025, 06:22 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా  తిరుమల  శ్రీవారిని దర్శించుకోనున్నారు. సింగపూర్ నుంచి ఇండియా రాగానే, ఆదివారం సాయంత్రం  ఆమె  తిరుమల చేరుకున్నారు. తిరుమల కొండపై గాయత్రి సదనంలో రాత్రి బసచేయబోతున్నారు అన్నా లెజినోవా.  

25
Asianet Image

మొక్కులో భాగంగా  శ్రీనివాసుడికి  తలనీలాలు సమర్పించుకున్నారు అన్నా లెజినోవా. సింగపూర్ లో  తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి అగ్ని ప్రమాదంలో గాయపడినా, ప్రాణాపాయం నుంచి బయటపడటంతో తిరుమల శ్రీవారిని కుటుంబంతో కలిసి దర్శించుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావించారు.

35
Asianet Image

అన్నా లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేశారు అన్నాలేజినోవా. గాయత్రి సదనం లో టిటిడి ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాల పైన సంతకం చేశారు.

45
Asianet Image

ఆతరువాత సాధారణ భక్తుల్లాగానే కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నాలెజినోవా,  పవన్ కళ్యాణ్ భార్య వచ్చారని తెలిసి ఆమెను చూడటానికి భక్తులు ఎగబడ్డారు.  

55
Asianet Image

ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి.. సోమవారం ఉదయం సుప్రభాతసేవలో తన పిల్లలతో కలిసి తిరుమలేశుని  దర్శనం చేసుకోనున్నారు. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
Top Stories