భార్యతో కలిసి పవన్ కళ్యాణ్ పబ్లిక్లో తిరగడం వెనుక ఆంతర్యమిదేనా?.. పవర్ స్టార్ పెద్ద స్కెచ్చే వేశాడుగా!
పవన్ కళ్యాణ్ ఇటీవల తన భార్య అనా కొణిదెలతో కలిసి పబ్లిక్లో తిరగడం చర్చనీయాంశం అవుతుంది. అయితే దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందని సమాచారం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రొఫేషనల్ పొలిటికల్ లీడర్గా మారబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఆయన పూర్తి స్థాయి నాయకుడిగా మారిపోయాడు. సినిమా హీరో కంటే రాజకీయ నాయకుడిగా ప్రభావితం చేస్తున్నారు. పవర్స్టార్ని డామినేట్ చేస్తున్నాడని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి ఏపీ 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. సర్వేలు, తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని తెలుస్తుంది. పవన్ రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతున్నాడని తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వంలో ఆయన కింగ్ మేకర్గా మారబోతున్నాడని సమాచారం.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల తన భార్య అన్నా లెజినోవాతో కలిసి కనిపిస్తున్నారు. ఓటింగ్ రోజు తన భార్యతో కలిసి పోలింగ్ బూతుకు వచ్చాడు. ఆమెకి ఓటు హక్కు లేకపోయినా తీసుకొచ్చి అందరికి చూపించే ప్రయత్నం చేశాడు. దీంతో ఇది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఓటు హక్కులేని పవన్.. తన భార్యతో ఎందుకు రావాల్సి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు మోడీ వారణాసి నామినేషన్స్ సందర్భంగా, ఆయన నామినేషన్ కార్యక్రమంలోనూ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడికి కూడా పవన్ తన భార్యతోనే వెళ్లడం మరో విశేషం. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్లిపూజలు, అభిషేకం చేశారు.
ఇందులో పవన్తోపాటు భార్య అనా కొణిదెల ఆలయాన్ని తిలకించింది. పవన్ దగ్గరుంచి వివరించారు. వీరితోపాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖా మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా కూడా ఉండటం విశేషం. దీంతో దేశ రాజకీయాల్లోనూ పవన్ కీలకంగా మారుతున్నారని అనిపిస్తుంది.
అయితే ఈ కార్యక్రమానికి కూడా తన భార్యతో పవన్ వెళ్లడం అటు రాజకీయా వర్గాల్లో, ఇటు సినిమా రంగంలోనూ చర్చనీయాంశం అవుతుంది. పవన్ ప్లాన్ ఏంటి? దాని ఆంతర్యమేంటి అనేది పెద్ద ప్రశ్న. అయితే దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర చర్చ నడుస్తుంది. పవన్ తన మూడో భార్య అనా కొణిదెలతో విడిపోయాడంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయని, దీంతో ఈ ఇద్దరు విడిపోతున్నారని, అనా రష్యా వెళ్లిపోయిందని, ఇద్దరు దూరంగా ఉంటున్నారని తెలిసింది. నాల్గో పెళ్లికి పవన్ రెడీ అవుతున్నారని అన్నారు. దీన్నే ఛాన్స్ గా తీసుకుని వైసీపీ నాయకులు రెచ్చిపోయి విమర్శలు చేశారు. వాటన్నింటికి సమాధానం చెప్పే ఉద్దేశ్యంతో పవన్ ఇలా తన భార్యని పబ్లిక్లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.
పవన్ రాజకీయంగా రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలక నాయకుడిగా మారబోతున్నాడు. ఆయన స్థాయి పెరుగుతుంది. దీంతో ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విమర్శలకు తావులేకుండా, ఆ వైపు చర్చ లేకుండా చేసేందుకు, అదే సమయంలో ఆడవాళ్ల వైపు నుంచి నెగటివ్ ఇమేజ్ లేకుండా ఉండేందుకు పవన్ ఇలా ప్లాన్ చేశారని తెలుస్తుంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు ఉన్న మాట, భార్య రష్యా వెళ్లిపోయిన మాట నిజమే అని, కాకపోతే ఆ సమస్యలను పవన్ సెట్ చేసుకున్నారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ మొదట 1997లో నందిని వివాహం చేసుకున్నారు. ఇద్దరికి సెట్ కాలేదు. పదేళ్ల తర్వాత విడిపోయారు. ఇద్దరు విడిపోవడానికి ముందే పవన్ రేణు దేశాయ్తో ప్రేమలో పడ్డారు. రిలేషన్షిప్ మెయింటేన్ చేశాడు. పెళ్లికి ముందే ఆమెతో బిడ్డని అకీరా నందన్ని కన్నారు. 2009లో పెళ్లి తర్వాత ఆద్య జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకే విడిపోయారు. అనంతరం రష్యా నటి అనా లెజినెవాని 2013లో మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.