శివాజీ కావాలనే అలా చేశారా, బిగ్ బాస్ హౌస్ లో ఇంద్ర సినిమా ట్విస్ట్..పరుచూరి కామెంట్స్ వైరల్
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంతటి వినోదాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్ 7 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫినాలే ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్ బిగ్ బాస్ ని మరచిపోవడం లేదు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంతటి వినోదాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్ 7 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫినాలే ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్ బిగ్ బాస్ ని మరచిపోవడం లేదు. పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన వివాదాలే అందుకు కారణం. మరో వైపు శివాజీ కెరీర్ లో కూడా మునుపటి జోష్ వచ్చేసింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hk3wra1xgamyg9v1a3rxjw8c/bigg-boss-telugu-5-nagarjuna-plans-sudden-elimination-jpg_300x162xt.jpg)
Nagarjuna
బిగ్ బాస్ సీజన్ 7 హైలైట్స్ గురించి మాట్లాడుతూ సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీజన్ 7 మొత్తం నాగార్జున గారు చెప్పినట్లు ఉల్టా పల్టా అన్నట్లుగానే సాగింది అని పరుచూరి అన్నారు. సీజన్ 7 లో ఎవరు ఉల్టా అనుకున్నారో వారు పల్టా అయ్యారు. ఎవరు పల్టా అనుకున్నారో వారు ఉల్టా అయ్యారు అని తెలిపారు. శివాజీ విషయంలో ఇది జరిగింది.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయినప్పుడు 50 శాతం అభిమానుల మద్దతు శివాజీకే ఉండింది. కానీ అంచెలంచెలుగా పల్లవి ప్రశాంత్ పైకి వచ్చాడు. మొదట తేడా తేడాగా కనిపించిన అమర్ దీప్ సైతం తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుని రన్నరప్ గా నిలవడం నిజంగా షాకింగ్.
అయితే అంత అద్భుతంగా ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ కి అలా జరగడం బాధాకరం అని పరుచూరి అరెస్ట్ గురించి కామెంట్స్ చేశారు. శివాజీ టైటిల్ రేసులో ఉన్నప్పటికీ కావాలనే తప్పుకున్నట్లు పరుచూరి అన్నారు. తాను ఇష్టపడిన వారికి మద్దతు తెలిపి టైటిల్ గెలిచేలా చేశాడు. శివాజీ మా ఇంద్ర సినిమా చేశాడు. ఇంటర్వెల్ లో శివాజీ పాత్రలో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో అందరికి తెలుసు.
బిగ్ బాస్ లో కూడా అలాంటి ట్విస్టే ఉంటుందని ఊహించా. శివాజీ టైటిల్ గెలుస్తాడని అంతా అన్నారు. కానీ చివర్లో ప్రశాంత్ వచ్చాడు. కాకపోతే రెండవ స్థానంలో శివాజీ ఉంటాడని అనుకున్నా. ఊహించని విధంగా అమర్ దీప్ వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 7లో నాగార్జున ప్రతి అంశాన్ని అద్భుతంగా మ్యానేజ్ చేసినట్లు పరుచూరి అభినందించారు.
పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా అందరి మనసులకు చేరువయ్యాడు. మేము కూడా భూమి పుత్రులమే. నా చిన్నతనంలో పొలం పనులు చేశా అని పరుచూరి గుర్తు చేసుకున్నారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన స్వగ్రామానికి వెళ్లి సంబరాలు చేసుకుని ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. ఏది ఏమైనా అతడికి నా అభినందనలు అని పరుచూరి అన్నారు.